బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్ ఖాన్ సహా చాలామంది సెలబ్రెటీలు ఎన్నో ఏళ్లుగా ఈ పని చేస్తూనే ఉన్నారు. కానీ వారి అభిమానులకు మాత్రం ఇలాంటివి చూసినపుడు ఏదోలా ఉంటుంది. దేశంలో అంత పెద్ద స్టార్లు అయి ఉండి.. ఇలా ప్రైవేట్ వెడ్డింగ్స్లో డ్యాన్సులు చేయడమేంటి అనిపిస్తూ ఉంటుంది.
తమకు సన్నిహితులైన వారి పెళ్లిళ్లలో డ్యాన్స్ చేసినా ఒక అర్థం ఉంది కానీ.. తమ ఇమేజ్ చూసుకోకుండా కేవలం డబ్బు కోసం ఇలా ఈవెంట్లకు వెళ్లి నృత్యాలు చేయడం ఏంటి అని అభిమానులే ప్రశ్నిస్తుంటారు. ఇటీవల ఒక పెళ్లి వేడుకలో షారుఖ్ ఇలా డ్యాన్స్ చేయడం.. తనతో కలిసి నృత్యం చేయడానికి పెళ్లి కూతురు అంగీకరించకపోయినా షారుఖ్ ఆమెను బతిమలాడుతున్నట్లు కనిపించడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు.
ఈ నేపథ్యంలో షారుఖ్ మారతాడో లేదో కానీ.. మరో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ మాత్రం ఇకపై ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. గతంలో సైఫ్ సైతం మిగతా స్టార్లలాగే ప్రైవేట్ వెడ్డింగ్స్కు వెళ్లి డ్యాన్సులు చేసిన వాడే. కానీ ఇకపై తాను అలా చేయనంటున్నాడు సైఫ్.
‘‘కెరీర్ ఆరంభంలో వివాహ వేడుకలకు వెళ్లి సరదాగా ఆడి పాడేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలా చేయడం నాకు అసౌకర్యంగా అనిపిస్తోంది. వేరే వాళ్ల పెళ్లిళ్లలో మనం డ్యాన్సులు చేస్తే మన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు’’ అని కుండబద్దలు కొట్టాడు సైఫ్. మరి ఈ సీనియర్ హీరో నిర్ణయం మిగతా వారిలో కూడా మార్పు తెస్తుందేమో చూడాలి. షారుఖ్ మాత్రమే కాదు.. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ లాంటి టాప్ స్టార్లు సైతం పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేసిన వాళ్లే. అందరిలోకి షారుఖ్నే ఎక్కువగా ఇలాంటి ఈవెంట్లలో చూస్తుంటాం.
This post was last modified on December 18, 2025 2:43 pm
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…