‘అల వైకుంఠపురములో’ సక్సెస్ అల్లు అర్జున్ని సరాసరి నంబర్వన్ స్థానానికి పోటీలో నిలబెట్టింది. ఈ టైమ్లో అతను వరుసగా రెండు పెద్ద హిట్లిస్తే ఇక తన పోటీదారులకు తనను అందుకోవడం కష్టమవుతుంది. అల..కి కంటిన్యూషన్గా పుష్ప లాంటి ప్రాజెక్ట్ తో పాటు కొరటాల శివ చిత్రాన్ని లైన్లో పెట్టి బన్నీ పకడ్బందీ వ్యూహంతో వెళుతున్నాడు. కాకపోతే కరోనా కారణంగా అల్లు అర్జున్ వేగానికి కళ్లెం పడింది.
మొత్తానికి పుష్ప షూటింగ్ మొదలు పెడితే యూనిట్ సభ్యులు కరోనా బారిన పడడంతో షూటింగ్కి బ్రేక్ పడింది. దీంతో షూటింగ్ ఆగకుండా ప్లాన్ చేయమని అల్లు అర్జున్ నిర్మాతలకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చాడట. కరోనా కోసమని బ్రేక్స్ తీసుకోలేమని, ఎవరైనా వైరస్ బారిన పడితే వాళ్లకు బ్రేక్ ఇచ్చి షూటింగ్ కంటిన్యూ చేయాలని, ఇక ఈ చిత్రం షూటింగ్ నిరాటంకంగా జరిగేలా చూడాలని చెప్పాడట.
అయితే అవుట్డోర్లోనే ఎక్కువ భాగం షూటింగ్ చేయాల్సి వుండడం వల్ల ఈ సినిమా ప్లానింగ్ లైన్ ప్రొడ్యూసర్లకు తలకు మించిన యవ్వారంగా మారిందట. ఈ చిత్రం త్వరగా పూర్తి చేయకపోతే, ఆచార్య ముగించుకుని కొరటాల శివ వేరే సినిమా మొదలు పెడతాడు కనుక అలా జరగకుండా అల్లు అర్జున్ జాగ్రత్త పడుతున్నాడట.
This post was last modified on December 9, 2020 9:13 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…