‘అల వైకుంఠపురములో’ సక్సెస్ అల్లు అర్జున్ని సరాసరి నంబర్వన్ స్థానానికి పోటీలో నిలబెట్టింది. ఈ టైమ్లో అతను వరుసగా రెండు పెద్ద హిట్లిస్తే ఇక తన పోటీదారులకు తనను అందుకోవడం కష్టమవుతుంది. అల..కి కంటిన్యూషన్గా పుష్ప లాంటి ప్రాజెక్ట్ తో పాటు కొరటాల శివ చిత్రాన్ని లైన్లో పెట్టి బన్నీ పకడ్బందీ వ్యూహంతో వెళుతున్నాడు. కాకపోతే కరోనా కారణంగా అల్లు అర్జున్ వేగానికి కళ్లెం పడింది.
మొత్తానికి పుష్ప షూటింగ్ మొదలు పెడితే యూనిట్ సభ్యులు కరోనా బారిన పడడంతో షూటింగ్కి బ్రేక్ పడింది. దీంతో షూటింగ్ ఆగకుండా ప్లాన్ చేయమని అల్లు అర్జున్ నిర్మాతలకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చాడట. కరోనా కోసమని బ్రేక్స్ తీసుకోలేమని, ఎవరైనా వైరస్ బారిన పడితే వాళ్లకు బ్రేక్ ఇచ్చి షూటింగ్ కంటిన్యూ చేయాలని, ఇక ఈ చిత్రం షూటింగ్ నిరాటంకంగా జరిగేలా చూడాలని చెప్పాడట.
అయితే అవుట్డోర్లోనే ఎక్కువ భాగం షూటింగ్ చేయాల్సి వుండడం వల్ల ఈ సినిమా ప్లానింగ్ లైన్ ప్రొడ్యూసర్లకు తలకు మించిన యవ్వారంగా మారిందట. ఈ చిత్రం త్వరగా పూర్తి చేయకపోతే, ఆచార్య ముగించుకుని కొరటాల శివ వేరే సినిమా మొదలు పెడతాడు కనుక అలా జరగకుండా అల్లు అర్జున్ జాగ్రత్త పడుతున్నాడట.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…