‘అల వైకుంఠపురములో’ సక్సెస్ అల్లు అర్జున్ని సరాసరి నంబర్వన్ స్థానానికి పోటీలో నిలబెట్టింది. ఈ టైమ్లో అతను వరుసగా రెండు పెద్ద హిట్లిస్తే ఇక తన పోటీదారులకు తనను అందుకోవడం కష్టమవుతుంది. అల..కి కంటిన్యూషన్గా పుష్ప లాంటి ప్రాజెక్ట్ తో పాటు కొరటాల శివ చిత్రాన్ని లైన్లో పెట్టి బన్నీ పకడ్బందీ వ్యూహంతో వెళుతున్నాడు. కాకపోతే కరోనా కారణంగా అల్లు అర్జున్ వేగానికి కళ్లెం పడింది.
మొత్తానికి పుష్ప షూటింగ్ మొదలు పెడితే యూనిట్ సభ్యులు కరోనా బారిన పడడంతో షూటింగ్కి బ్రేక్ పడింది. దీంతో షూటింగ్ ఆగకుండా ప్లాన్ చేయమని అల్లు అర్జున్ నిర్మాతలకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చాడట. కరోనా కోసమని బ్రేక్స్ తీసుకోలేమని, ఎవరైనా వైరస్ బారిన పడితే వాళ్లకు బ్రేక్ ఇచ్చి షూటింగ్ కంటిన్యూ చేయాలని, ఇక ఈ చిత్రం షూటింగ్ నిరాటంకంగా జరిగేలా చూడాలని చెప్పాడట.
అయితే అవుట్డోర్లోనే ఎక్కువ భాగం షూటింగ్ చేయాల్సి వుండడం వల్ల ఈ సినిమా ప్లానింగ్ లైన్ ప్రొడ్యూసర్లకు తలకు మించిన యవ్వారంగా మారిందట. ఈ చిత్రం త్వరగా పూర్తి చేయకపోతే, ఆచార్య ముగించుకుని కొరటాల శివ వేరే సినిమా మొదలు పెడతాడు కనుక అలా జరగకుండా అల్లు అర్జున్ జాగ్రత్త పడుతున్నాడట.
This post was last modified on December 9, 2020 9:13 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…