Movie News

ప్రభాస్ విజయ్ ఇద్దరూ ఒకే దారిలో

జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్, జన నాయకుడు పరస్పరం తలపడేందుకు సిద్ధపడటంతో బాక్సాఫీస్ క్లాష్ లో ఎవరు విజేత అవుతారనే దాని మీద రకరకాల అంచనాల్లో ఉన్నారు. ఇప్పుడేం కనిపించడం లేదు కానీ తేదీ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్ల పేరుతో ఆన్ లైన్ యుద్దాలు చేసుకోవడం ఖాయమనిపిస్తోంది. విజయ్ వల్ల రాజా సాబ్ కు తమిళనాడు, కేరళలో థియేటర్ల పరంగా దెబ్బ పడనుండగా ప్రభాస్ వల్ల జన నాయకుడుకి ఏపీ, తెలంగాణలో ఎదురీత ఉంటుంది. ఈ మెగా క్లాష్ వల్ల ఓపెనింగ్స్ పంచుకోవాల్సి ఉంటుంది.

ఇక అసలు విషయానికి వస్తే నిడివి విషయంలోనూ ఈ రెండు సినిమాలు ఒకే దారిలో ఉన్నట్టు సమాచారం. రాజా సాబ్ ఫైనల్ కట్ 3 గంటల 20 నిముషాలు వచ్చిందని, ఒక పావు గంట ట్రిమ్ చేసే ఆలోచన జరుగుతోందని వినికిడి. అయితే దురంధర్, యానిమల్, పుష్ప 2 ఇంతకన్నా ఎక్కువ లెన్త్ తో ప్రేక్షకులను మెప్పించినప్పుడు రాజా సాబ్ కి ఎందుకు కోతనే కోణంలో దర్శకుడు మారుతీ ఆలోచిస్తున్నారట. ఇక జన నాయకుడు కూడా ఇంచు మించు ఇదే నిడివితో 3 గంటల 15 నిమిషాల దాకా ఉండొచ్చని అంటున్నారు. విజయ్ చివరి సినిమా కాబట్టి పదిహేను నిమిషాల స్పెషల్ వీడియోని ప్లాన్ చేస్తున్నారట.

బహుశా ఫ్యాన్స్ ఎమోషన్స్ ని టార్గెట్ చేయడం కోసం కావొచ్చు. ఏమైనా ఫైనల్ సెన్సార్ లెన్త్ ఎంత ఉంటుందనేది ఆ కార్యక్రమం పూర్తయ్యాకే బయటికి వస్తుంది. అసలే సంక్రాంతి పోటీ. బరిలో మొత్తం ఏడు సినిమాలున్నాయి. వాటితో తలపడాలంటే రాజా సాబ్, జన నాయకుడు యునానిమస్ అనిపించుకోవాలి. కాకపోతే అందరి కంటే ముందు వస్తున్న అడ్వాంటేజ్ ప్రభాస్, విజయ్ లకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎలాగూ టికెట్ హైక్స్ ఇస్తారు కాబట్టి వీలైనంత మొదటి మూడు నాలుగు రోజుల్లోనే రాబట్టేయాలి. చాలా సినిమాలు ఇలా నిడివిని పెంచుకోవడం వల్ల ఖర్చు పెరుగుతుందని ఎగ్జిజిబిటర్లు వాపోతున్నారు.

This post was last modified on December 16, 2025 5:09 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

18 minutes ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

2 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

6 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

7 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

7 hours ago