బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అందుక్కారణం ఆమె పెట్టిన కొన్ని షరతులే కారణమని వార్తలు వచ్చాయి. అందులో ఒకటి 8 గంటల పని విధానం. రోజుకు కచ్చితంగా 8 గంటలే పని చేస్తానని.. అంతకుమించి కుదరదని ఆమె తేల్చి చెప్పడం.. దీనికి తోడు వేరే డిమాండ్లు కూడా చేయడంతో తప్పక ఆ రెండు సినిమాల నుంచి మేకర్స్ ఆమెను తప్పించినట్లు ప్రచారం జరిగింది.
తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె 8 గంటల పని విధానం విషయంలో తాను కచ్చితంగా ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. కొందరు సినీ జనాలు దీన్ని సమర్థించారు. ఎక్కువమంది వ్యతిరేకించారు. ఐతే స్వయంగా దీపిక భర్త రణ్వీర్ సింగ్.. దీపికకు వ్యతిరేకంగా నిలవడం విశేషం. 8 గంటల పని విధానానికి కచ్చితంగా కట్టుబడి ఉండాలంటే కష్టమని అతను అభిప్రాయపడ్డాడు.
కాకపోతే అతను ఆ వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు కాదు. 2022లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రణ్వీర్ ఈ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు దీపిక 8 గంటల పని విధానానికి బ్రాండ్ అంబాసిడర్లా మారిన నేపథ్యంలో తన పాత కామెంట్ల తాలూకు వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో.
‘‘చాలాసార్లు జనాలు పని సమయాల గురించి కంప్లైంట్లు చేస్తుంటారు. 8 గంటల షిఫ్ట్ అని చెప్పి 10-12 గంటలు పని చేయించుకుంటున్నారు అని అంటుంటారు. కానీ మనం అనుకున్న పని 8 గంటల్లో పూర్తి కాకపోతే.. కొంచెం అదనపు సమయం పని చేయాల్సి ఉంటుంది’’ అని రణ్వీర్ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. మరి ఇప్పుడు తన భార్య 8 గంటల పని విధానం విషయంలో కచ్చితంగా ఉంటున్న నేపథ్యంలో రణ్వీర్ తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడా.. లేక పాత కామెంట్లకే కట్టుబడి ఉంటాడా అన్నది ఆసక్తికరం.
This post was last modified on December 15, 2025 3:17 pm
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…