బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అందుక్కారణం ఆమె పెట్టిన కొన్ని షరతులే కారణమని వార్తలు వచ్చాయి. అందులో ఒకటి 8 గంటల పని విధానం. రోజుకు కచ్చితంగా 8 గంటలే పని చేస్తానని.. అంతకుమించి కుదరదని ఆమె తేల్చి చెప్పడం.. దీనికి తోడు వేరే డిమాండ్లు కూడా చేయడంతో తప్పక ఆ రెండు సినిమాల నుంచి మేకర్స్ ఆమెను తప్పించినట్లు ప్రచారం జరిగింది.
తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె 8 గంటల పని విధానం విషయంలో తాను కచ్చితంగా ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. కొందరు సినీ జనాలు దీన్ని సమర్థించారు. ఎక్కువమంది వ్యతిరేకించారు. ఐతే స్వయంగా దీపిక భర్త రణ్వీర్ సింగ్.. దీపికకు వ్యతిరేకంగా నిలవడం విశేషం. 8 గంటల పని విధానానికి కచ్చితంగా కట్టుబడి ఉండాలంటే కష్టమని అతను అభిప్రాయపడ్డాడు.
కాకపోతే అతను ఆ వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు కాదు. 2022లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రణ్వీర్ ఈ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు దీపిక 8 గంటల పని విధానానికి బ్రాండ్ అంబాసిడర్లా మారిన నేపథ్యంలో తన పాత కామెంట్ల తాలూకు వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో.
‘‘చాలాసార్లు జనాలు పని సమయాల గురించి కంప్లైంట్లు చేస్తుంటారు. 8 గంటల షిఫ్ట్ అని చెప్పి 10-12 గంటలు పని చేయించుకుంటున్నారు అని అంటుంటారు. కానీ మనం అనుకున్న పని 8 గంటల్లో పూర్తి కాకపోతే.. కొంచెం అదనపు సమయం పని చేయాల్సి ఉంటుంది’’ అని రణ్వీర్ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. మరి ఇప్పుడు తన భార్య 8 గంటల పని విధానం విషయంలో కచ్చితంగా ఉంటున్న నేపథ్యంలో రణ్వీర్ తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడా.. లేక పాత కామెంట్లకే కట్టుబడి ఉంటాడా అన్నది ఆసక్తికరం.
This post was last modified on December 15, 2025 3:17 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…