బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అందుక్కారణం ఆమె పెట్టిన కొన్ని షరతులే కారణమని వార్తలు వచ్చాయి. అందులో ఒకటి 8 గంటల పని విధానం. రోజుకు కచ్చితంగా 8 గంటలే పని చేస్తానని.. అంతకుమించి కుదరదని ఆమె తేల్చి చెప్పడం.. దీనికి తోడు వేరే డిమాండ్లు కూడా చేయడంతో తప్పక ఆ రెండు సినిమాల నుంచి మేకర్స్ ఆమెను తప్పించినట్లు ప్రచారం జరిగింది.
తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె 8 గంటల పని విధానం విషయంలో తాను కచ్చితంగా ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. కొందరు సినీ జనాలు దీన్ని సమర్థించారు. ఎక్కువమంది వ్యతిరేకించారు. ఐతే స్వయంగా దీపిక భర్త రణ్వీర్ సింగ్.. దీపికకు వ్యతిరేకంగా నిలవడం విశేషం. 8 గంటల పని విధానానికి కచ్చితంగా కట్టుబడి ఉండాలంటే కష్టమని అతను అభిప్రాయపడ్డాడు.
కాకపోతే అతను ఆ వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు కాదు. 2022లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రణ్వీర్ ఈ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు దీపిక 8 గంటల పని విధానానికి బ్రాండ్ అంబాసిడర్లా మారిన నేపథ్యంలో తన పాత కామెంట్ల తాలూకు వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో.
‘‘చాలాసార్లు జనాలు పని సమయాల గురించి కంప్లైంట్లు చేస్తుంటారు. 8 గంటల షిఫ్ట్ అని చెప్పి 10-12 గంటలు పని చేయించుకుంటున్నారు అని అంటుంటారు. కానీ మనం అనుకున్న పని 8 గంటల్లో పూర్తి కాకపోతే.. కొంచెం అదనపు సమయం పని చేయాల్సి ఉంటుంది’’ అని రణ్వీర్ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. మరి ఇప్పుడు తన భార్య 8 గంటల పని విధానం విషయంలో కచ్చితంగా ఉంటున్న నేపథ్యంలో రణ్వీర్ తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడా.. లేక పాత కామెంట్లకే కట్టుబడి ఉంటాడా అన్నది ఆసక్తికరం.
This post was last modified on December 15, 2025 3:17 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…