ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా ఏడు సినిమాలు పోటీలో ఉండటంతో బయ్యర్ల అగచాట్లు భారీ ఎత్తున తలెత్తనున్నాయి ముఖ్యంగా బిసి సెంటర్లలో షోలు అడ్జస్ట్ చేయడం, మల్టీప్లెక్సుల్లో పంపకాలు పెద్ద తలనెప్పి అయ్యేలా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ తెలంగాణలో ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉంటాయా లేదానే దాని గురించి. సందర్భం వచ్చింది కాబట్టి మన శంకర వరప్రసాద్ గారు నిర్మాత సాహు గారపాటి, రాజా సాబ్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ తమ వెర్షన్లు వినిపించారు.
ప్రయత్నాలు చేస్తామని, ఫైనల్ గా ప్రభుత్వాలు, కోర్టులు చెప్పినట్టు వినాలనే రీతిలో సంకేతాలు ఇచ్చారు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈసారి సంక్రాంతి నిర్మాతలు ముందుజాగ్రత్త చర్యగా ఏమేం చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారట. ప్రధానంగా వస్తున్న సమస్య ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం కాబట్టి తామే జాగ్రత్త పడి వెంటనే కౌంటర్లు దాఖలు చేసేందుకు ఏమేం కావాలో అవన్నీ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఉదాహరణకు ఒక సినిమాకు రెండు వందల కోట్ల బడ్జెట్ అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు సిద్ధంగా ఉంచుకుని, పెంపు ఇవ్వకపోతే వచ్చే నష్టాలను వివరించేలా వెర్షన్లు రెడీ చేస్తున్నారట.
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన ప్రకారం ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ పెంపు ఉండవని చెప్పారు కానీ పండగ టైంకి పరిస్థితిలో మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఒకవేళ హైక్ లేకపోయినా ఇప్పుడున్న గరిష్ట ధరలతో పాటు ఏపీలో ఎలాగూ పెంపు వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా బిజినెస్ బ్యాలన్స్ చేసేలా మరో ప్లాన్ రెడీ చేశారట. ఇప్పుడే ఏదీ తేలదు కానీ అఖండ 2 విషయంలో మరో పది రోజుల్లో వచ్చే తీర్పు ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఇక్కడ చర్చించిన దాంట్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు. అప్పటిదాకా ఈ సంకటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది.
This post was last modified on December 14, 2025 10:04 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…