తొలి సినిమా ఓ దర్శకుడి కెరీర్కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా ఫలితాన్ని బట్టి రాత్రికి రాత్రి అతడి జీవితం మారిపోతుంటుంది. ఆ సినిమా సక్సెస్ అయితే.. వెంటనే నిర్మాతలు లైన్లోకి వచ్చేస్తారు. తేడా కొడితే పట్టించుకునే వాడుండడు. పుష్కరం కిందట ‘ఓయ్’ సినిమాతో ప్రామిసింగ్ డైరెక్టర్ అవుతాడన్న అంచనాలు కలిగించాడు ఆనంద్ రంగా. ఆ సినిమాకు విడుదల ముంగిట మంచి బజ్ వచ్చింది. పాటలు సూపర్ హిట్టయ్యాయి. ప్రోమోలు ఆకర్షణీయంగా కనిపించాయి. కానీ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. సినిమా థియేటర్లలో నిలబడలేదు. దీంతో ఆనంద్ కెరీర్కు ఆరంభంలోనే బ్రేక్ పడిపోయింది.
దీని తర్వాత ‘పొగ’ అని నవదీప్ హీరోగా ఒక సినిమా చేశాడు కానీ.. అది థియేటర్లలోకే రాలేదు. ఇంకా ఏవో చిన్నా చితకా ప్రయత్నాలు చేసిన ఆనంద్.. టాలీవుడ్లో తన ముద్రను వేయలేకపోయాడు. లైమ్ లైట్లో లేకుండా పోయాడు.
సుదీర్ఘ విరామం తర్వాత ఆనంద్ రంగా మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. కాకపోతే ఈసారి అతను తీసింది సినిమా కాదు.. వెబ్ సిరీస్. దాని పేరు.. షూటౌట్ అట్ ఆలేర్. పేరుకు వెబ్ సిరీసే కానీ కంటెంట్, ఆర్టిస్టుల పరంగా చూస్తే సినిమా స్థాయికి తగ్గట్లే ఉంది ‘షూటౌట్ అట్ ఆలేర్’. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించడం విశేషం. తాజాగా దీని ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అదే పనిగా పోలీసులను లక్ష్యంగా చేసుకుని వాళ్లను కిరాతకంగా చంపడం మొదలుపెట్టిన అక్తర్ అనే కరడుగట్టిన క్రిమినల్ను కట్టడి చేయడానికి పోలీసులు చేపట్టిన ఆపరేషన్ నేపథ్యంలో నడిచే సిరీస్ ఇది.
అక్తర్ పాత్రలో ఎవరో కొత్త నటుడు చేశాడు కానీ.. ఆ పాత్రకు అతను పర్ఫెక్ట్ అనిపిస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులుగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కనిపిస్తున్నారు. ఈ సిరీస్ మోస్ట్ వయొలెంట్గా, ఉత్కంఠభరితంగా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ల్లో మాదిరి ఘాటైన శృంగార సన్నివేశాలకు కూడా ఢోకా లేదు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమ్ కానుంది.
This post was last modified on December 9, 2020 1:58 pm
గతంలో హీరోగా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించిన కమెడియన్ సప్తగిరి.. చివరగా లీడ్ రోల్ చేసిన రెండు మూడు సినిమాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన తెలంగాణ నేత, హైదరాబాద్ పాత బస్తీ పరిధి గోషా మహల్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్న…
ఏపీ విపక్షం వైసీపీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నచందంగా పరిస్థితి మారిపోయింది. అసెంబ్లీ లో ఆ పార్టీకి 11…
రాజకీయాల్లో నాయకుల ప్రతిభ, ఎత్తులు పై ఎత్తులు.. ఎన్ని ఉన్నా చివరాఖరుకు.. సామాజిక వర్గాల దన్ను, వారి మద్దతు లేకుండా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ అధినేత వైైఎస్ జగన్…
సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఏకంగా ఒక సినిమా ప్రమోషన్ ఎలా ఉండాలో సూచించే స్థాయికి వెళ్ళిపోయింది.…