అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక సీనియర్ ఆటగాడికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లేదా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు ఇస్తే.. వాటికి తమ కంటూ జూనియర్లు అర్హులని, వారిదే మెరుగైన ప్రదర్శన అని కొందరు సీనియర్లు వాళ్ల చేతిలో పెట్టేస్తుంటారు. ఇలాంటి ఉదంతాలు అరుదుగానే జరుగుతుంటాయి. చాలా కాలం తర్వాత అలాంటి దృశ్యం.. భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ముగింపు సందర్భంగా చోటు చేసుకుంది.
భారత జట్టు 2-1తో సిరీస్ను గెలుచుకోవడంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా రెండో టీ20లో అతడి మెరుపు ఇన్నింగ్సే జట్టును గెలిపించింది. తొలి టీ20లోనూ అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్సే ఆడాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ఇచ్చారు. కానీ అతను మాత్రం ఆ అవార్డుకు తాను అర్హుడిని కాదు అనేశాడు.
ఈ సిరీస్తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టి వరుసగా మెరుపు బౌలింగ్ ప్రదర్శనలతో అందరి దృష్టినీ ఆకర్షించిన తమిళనాడు లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్కు హార్దిక్ తన ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ఇచ్చేశాడు. తొలి రెండు టీ20ల్లో రెండు చొప్పున వికెట్లతో నటరాజన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రెండో టీ20లో హార్దిక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కగా.. అప్పుడే అతను ఇందుకు తాను కాదు, నటరాజనే అర్హుడు అని వ్యాఖ్యానించాడు.
మిగతా బౌలర్లందరూ విఫలమైన పిచ్ మీద ఎంతో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాక రెండు కీలక వికెట్లు తీసిన నటరాజన్కే ఆ అవార్డు దక్కాలన్నాడు. ఇక మూడో టీ20లో భారత్ ఓడినప్పటికీ సిరీస్ సొంతం కాగా.. బహుమతి ప్రదానోత్సవంలో తనకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందిస్తే దాన్ని తీసుకెళ్లి నేరుగా నటరాజన్ చేతిలో పెట్టేసి తన క్రీడా స్ఫూర్తిని చూపించాడు. ఇలాంటి టీమ్ స్పిరిట్, పెద్ద మనసు అందరికీ ఉండదంటూ హార్దిక్ మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
This post was last modified on December 9, 2020 2:06 pm
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…