అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక సీనియర్ ఆటగాడికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లేదా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు ఇస్తే.. వాటికి తమ కంటూ జూనియర్లు అర్హులని, వారిదే మెరుగైన ప్రదర్శన అని కొందరు సీనియర్లు వాళ్ల చేతిలో పెట్టేస్తుంటారు. ఇలాంటి ఉదంతాలు అరుదుగానే జరుగుతుంటాయి. చాలా కాలం తర్వాత అలాంటి దృశ్యం.. భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ముగింపు సందర్భంగా చోటు చేసుకుంది.
భారత జట్టు 2-1తో సిరీస్ను గెలుచుకోవడంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా రెండో టీ20లో అతడి మెరుపు ఇన్నింగ్సే జట్టును గెలిపించింది. తొలి టీ20లోనూ అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్సే ఆడాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ఇచ్చారు. కానీ అతను మాత్రం ఆ అవార్డుకు తాను అర్హుడిని కాదు అనేశాడు.
ఈ సిరీస్తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టి వరుసగా మెరుపు బౌలింగ్ ప్రదర్శనలతో అందరి దృష్టినీ ఆకర్షించిన తమిళనాడు లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్కు హార్దిక్ తన ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ఇచ్చేశాడు. తొలి రెండు టీ20ల్లో రెండు చొప్పున వికెట్లతో నటరాజన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రెండో టీ20లో హార్దిక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కగా.. అప్పుడే అతను ఇందుకు తాను కాదు, నటరాజనే అర్హుడు అని వ్యాఖ్యానించాడు.
మిగతా బౌలర్లందరూ విఫలమైన పిచ్ మీద ఎంతో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాక రెండు కీలక వికెట్లు తీసిన నటరాజన్కే ఆ అవార్డు దక్కాలన్నాడు. ఇక మూడో టీ20లో భారత్ ఓడినప్పటికీ సిరీస్ సొంతం కాగా.. బహుమతి ప్రదానోత్సవంలో తనకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందిస్తే దాన్ని తీసుకెళ్లి నేరుగా నటరాజన్ చేతిలో పెట్టేసి తన క్రీడా స్ఫూర్తిని చూపించాడు. ఇలాంటి టీమ్ స్పిరిట్, పెద్ద మనసు అందరికీ ఉండదంటూ హార్దిక్ మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
This post was last modified on December 9, 2020 2:06 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…