తెలుగులో చాలా వేగంగా అగ్ర కథానాయికగా ఎదిగి.. కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కానీ వరుస ఫ్లాపుల వల్ల ఉన్నట్లుండి ఇక్కడ ఆమె కెరీర్ డౌన్ అయింది. అదే సమయంలో తన సొంత ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ కు వెళ్ళి సెటిల్ అయిపోయింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తుండగానే తన లాంగ్ టైం బాయ్ఫ్రెండ్, నిర్మాత రాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో తన జోరెమీ తగ్గలేదు. ఇప్పటికీ గ్లామర్ రోల్స్ కూడా కొనసాగిస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన ‘దే దే ప్యార్ దే 2’లో రకుల్ సూపర్ సెక్సీగా కనిపించింది. ఈ చిత్రం ‘దే దే ప్యార్ దే’ లాగే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది. ఈ చిత్రంలో అజయ్, రకుల్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందనే టాక్ వచ్చింది. రకుల్ కంటే అజయ్ వయసు డబుల్ కావడం విశేషం.
సినిమాలో కథ పరంగా కూడా వీళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఇలాంటి పాత్రలు చెయ్యడం, ఎక్కువ వయసున్న హీరోలతో నటించడం పట్ల తనకు అభ్యంతరాలేమీ లేవంటోంది రకుల్.
“దే దే ప్యార్ దే-2 పెద్ద సక్సెస్ అయింది. ఆ సినిమా మీద ప్రేక్షకులు అపారమైన ప్రేమ చూపించారు. భవిష్యత్తులోనూ నాకు ఇలాంటి పాత్రలు ఆఫర్ చేస్తే కచ్చితంగా చేస్తా. నిజ జీవితంలో నేను అలాంటి వయసు అంతరం ఉన్న జంటలను చాలానే చూశా. అలాంటి జంట కథతో తీయడం తేలిక కాదు. ఇలాంటి బంధాలను జనం అంగీకరిస్తారు అని మేం సినిమాలో చూపించలేదు. అందులో ఉండే ఇబ్బందులు, వాటి ప్రభావాన్నే చూపించాం.
ఇక అజయ్ గారితో నా కెమిస్ట్రీ విషయానికి వస్తే నటించిన తర్వాత అంతా వేరుగా ఉంటుంది. ఆయన నాకు ఎప్పుడూ సారే. కెమెరా ఆఫ్ అవ్వగానే మనలోని వేరే వ్యక్తి బయటికి వస్తారు. ఆ మార్పు ఎలా జరుగుతుందో కూడా తెలీదు. ఒక ఏడుపు సీన్ చెయ్యడానికి ముందు నిజానికి మేం నవ్వుతూ ఉంటాం. నటన వేరు, నిజ జీవితం వేరు. మనం ఒక యాక్షన్ మూవీ చూశామంటే వెంటనే వీధుల్లోకి వెళ్ళి గన్ను పట్టుకుని కాల్చం కదా. కొన్ని సినిమాలు వినోదం కోసమే చేస్తాం. కొన్ని మన మీద ప్రభావం చూపుతాయి” అని రకుల్ తెలిపింది.
This post was last modified on December 12, 2025 8:22 pm
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…