గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే మెయిన్ సెంటర్స్ లో కొన్ని షోలు కొనసాగిస్తున్నారంటే ఎంత పాజిటివ్ గా జనంలోకి దూసుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. రెండు వందల కోట్లకు దగ్గరగా ఉన్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదివారం లోపే ఆ లాంఛనం పూర్తి చేసుకునేలా ఉంది. అయితే దురంధర్ పలు విషయాల్లో పలు వర్గాల్లో పెద్ద దెబ్బే కొట్టింది. ఉద్దేశపూర్వకంగా కొందరు ఇచ్చిన వీడియో రివ్యూలను నెటిజెన్లు రివర్స్ ఎటాక్ చేసి తీయించేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కాస్తా ముదిరి సోషల్ మీడియాలో డిబేట్ల దాకా వెళ్ళింది.
ఇంకో వైపు స్పై మూవీస్ అంటే గూఢచారులు నమ్మశక్యం కానీ స్టంట్లు చేస్తారని ఏక్ ధా టైగర్, టైగర్ జిందా హై, వార్, వార్ 2 లాంటి సినిమాలతో చూపించిన యష్ రాజ్ ఫిలింస్ ట్రెండ్ కి భిన్నంగా దర్శకుడు ఆదిత్య ధార్ అత్యంత సహజంగా దురంధర్ ని తెరకెక్కించిన విధానం ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఆడియన్స్ నుంచి దక్కుతున్న మద్దతు అనూహ్యం. ఈ లిస్టులో సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఏఎంబిలో షో చూసి ఒక సుదీర్ఘమైన ట్వీట్ పెట్టాడు. అందరికీ శుభాకాంక్షలు చెబుతూ తానెంత గొప్పగా ఆస్వాదించాడో పేరు పేరునా గుర్తు పెట్టుకుని మరీ ట్యాగ్ చేశాడు.
ఇది ఫ్లాప్ అవుతుందని పది రోజుల క్రితం వరకు బలంగా నమ్మిన కొన్ని వర్గాలకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. యాంటీ పాకిస్థాన్ అంటూ, అబద్దాలు చూపించారంటూ మసిపూసి మారేడుకాయలాగా నెగటివ్ గా ఏదో రుద్దాలని చూశారు కానీ దాన్ని తట్టుకుని మరీ దురంధర్ స్ట్రాంగ్ గా నిలిచాడు. ట్విస్ట్ ఏంటంటే మార్చి 19 విడుదల కాబోయే దురంధర్ 2 కోసం డిమాండ్ పెరుగుతోంది. ఇది గమనించే అజయ్ దేవగన్ తన ధమాల్ 4 వాయిదా వేసుకున్నాడని ముంబై టాక్. ఊహించని విధంగా చాలా మందికి నిద్రలేని రాత్రులు మిగిల్చిన దురంధర్ ఫైనల్ రన్ లోపు ఇంకా ఏమేం సంచలనాలు చేస్తాడో చూడాలి.
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…