గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే మెయిన్ సెంటర్స్ లో కొన్ని షోలు కొనసాగిస్తున్నారంటే ఎంత పాజిటివ్ గా జనంలోకి దూసుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. రెండు వందల కోట్లకు దగ్గరగా ఉన్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదివారం లోపే ఆ లాంఛనం పూర్తి చేసుకునేలా ఉంది. అయితే దురంధర్ పలు విషయాల్లో పలు వర్గాల్లో పెద్ద దెబ్బే కొట్టింది. ఉద్దేశపూర్వకంగా కొందరు ఇచ్చిన వీడియో రివ్యూలను నెటిజెన్లు రివర్స్ ఎటాక్ చేసి తీయించేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కాస్తా ముదిరి సోషల్ మీడియాలో డిబేట్ల దాకా వెళ్ళింది.
ఇంకో వైపు స్పై మూవీస్ అంటే గూఢచారులు నమ్మశక్యం కానీ స్టంట్లు చేస్తారని ఏక్ ధా టైగర్, టైగర్ జిందా హై, వార్, వార్ 2 లాంటి సినిమాలతో చూపించిన యష్ రాజ్ ఫిలింస్ ట్రెండ్ కి భిన్నంగా దర్శకుడు ఆదిత్య ధార్ అత్యంత సహజంగా దురంధర్ ని తెరకెక్కించిన విధానం ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఆడియన్స్ నుంచి దక్కుతున్న మద్దతు అనూహ్యం. ఈ లిస్టులో సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఏఎంబిలో షో చూసి ఒక సుదీర్ఘమైన ట్వీట్ పెట్టాడు. అందరికీ శుభాకాంక్షలు చెబుతూ తానెంత గొప్పగా ఆస్వాదించాడో పేరు పేరునా గుర్తు పెట్టుకుని మరీ ట్యాగ్ చేశాడు.
ఇది ఫ్లాప్ అవుతుందని పది రోజుల క్రితం వరకు బలంగా నమ్మిన కొన్ని వర్గాలకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. యాంటీ పాకిస్థాన్ అంటూ, అబద్దాలు చూపించారంటూ మసిపూసి మారేడుకాయలాగా నెగటివ్ గా ఏదో రుద్దాలని చూశారు కానీ దాన్ని తట్టుకుని మరీ దురంధర్ స్ట్రాంగ్ గా నిలిచాడు. ట్విస్ట్ ఏంటంటే మార్చి 19 విడుదల కాబోయే దురంధర్ 2 కోసం డిమాండ్ పెరుగుతోంది. ఇది గమనించే అజయ్ దేవగన్ తన ధమాల్ 4 వాయిదా వేసుకున్నాడని ముంబై టాక్. ఊహించని విధంగా చాలా మందికి నిద్రలేని రాత్రులు మిగిల్చిన దురంధర్ ఫైనల్ రన్ లోపు ఇంకా ఏమేం సంచలనాలు చేస్తాడో చూడాలి.
కరోనా తర్వాత ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్, స్కామ్ 1992 లాంటి బ్లాక్ బస్టర్స్ వల్ల కొంత కాలం వెబ్ సిరీస్…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా నెట్ ఫ్లిక్స్ చేసుకునే ఓటిటి విండో 28 రోజులు ఉంటుంది. గుంటూరు కారం,…
తెలంగాణలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు…
సుకుమార్ అంటే ఇప్పుడు కేవలం ఒక దర్శకుడు కాదు.. ఒక వ్యవస్థ. కేవలం దర్శకత్వానికి పరిమితం కాకుండా ఆయన నిర్మాతగానూ…
ఇండియాలో క్రికెట్ పిచ్చి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందున్నంత ఇంటెన్స్ ఫ్యాన్స్ ఇప్పుడు లేకపోవచ్చు. ఒక ఓటమితో…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన తన జీవిత లక్ష్యమని ఆయన…