గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే జరిగిందనే తరహాలో సంకేతాలు ఇస్తోంది. ప్రీమియర్ల బుకింగ్స్ జోరు మీదున్నాయి. హైదరాబాద్ రెగ్యులర్ షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ చూపిస్తుండగా బుక్ మై షో కన్నా ముందే సింగల్ స్క్రీన్ బెనిఫిట్ షో టికెట్లు పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయల దాకా బ్లాక్ లో అమ్ముతున్నట్టు సోషల్ మీడియా టాక్. అది నిజమా కాదానేది పక్కనపెడితే అఖండ 2కి గతంలో కంటే ఇప్పుడు మూమెంట్ బాగుండటం శుభ పరిణామం. ఏపీలో సీడెడ్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ గ్యారెంటీ అంటున్నారు.
బాక్సాఫీస్ వద్ద అఖండ 2కి చెప్పుకోదగ్గ పోటీ లేదు. ఒక రోజు ఆలస్యంగా వస్తున్న మోగ్లీ, అన్నగారు వస్తారు బజ్ విషయంలో వెనుకబడి ఉన్నాయి. కాకపోతే టాక్ ని నమ్ముకుని ఖచ్చితంగా హిట్ కొడతామనే ధీమా ఆయా బృందాల్లో ఉంది. కానీ బాలయ్య ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ లో ఉంది. క్రేజీ సీక్వెల్ కావడంతో పాటు ట్రైలర్ లో చూపించిన విజువల్స్ కేవలం శాంపిల్ మాత్రమేనని, అసలైన ఊచకోత తెరమీద చూస్తారని నిర్మాత రామ్ ఆచంట ఊరించడం చూస్తే అంచనాలు పెరిగిపోతున్నాయి. అర్ధరాత్రికే పూర్తి టాక్ వచ్చేస్తుంది కాబట్టి ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
అఖండ 2 మీద భారీ టార్గెట్లున్నాయి. రెండు వందల కోట్ల గ్రాస్ పక్కాగా వస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సంక్రాంతి ఇంకా దూరంలో ఉండటం, పెద్ద హీరోల సినిమాలు అప్పటిదాకా లేకపోవడం సానుకూలాంశంగా మారుతోంది. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చాక దర్శకుడు బోయపాటి శీను నాలుగుసారి బాలయ్యతో చేతులు కలిపారు. మళ్ళీ ఈ ఫీట్ రిపీట్ చేస్తామనే నమ్మకం ఇద్దరిలోనూ ఉంది. కేవలం ఒకే డ్యూయెట్ సాంగ్ పెట్టి మిగిలినదంతా హై వోల్టేజ్ భక్తి పాటలు ఇచ్చిన తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లి ఉంటే థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం. మరికొద్ది గంటల్లో ఈ సస్పెన్స్ వీడిపోతుంది.
This post was last modified on December 11, 2025 11:04 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…