Movie News

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే తరహాలో కొద్దిరోజుల క్రితం చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రిటీలు డిజిటల్ రక్షణ పొందిన సంగతి తెలిసిందే. నిజానికిదంతా ప్రారంభమే అని చెప్పాలి. ఎందుకంటే ఏఐ మెల్లగా జనాల్లోకి చొచ్చుకుపోతోంది. పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలో ప్రాథమికంగా నేర్చుకుంటే చాలు బోలెడు మేజిక్ చేయొచ్చు. అదే ఇప్పుడు సోషల్ మీడియా కొంప ముంచుతోంది. గత కొన్ని వారాలుగా ఈ ట్రెండ్ ఊపందుకుంది.

స్టార్ హీరోలంతా ఒక టీ కొట్టు దగ్గర కాఫీ తాగుతున్నట్టు, అందరూ కలిసి జాతరకు వెళ్లినట్టు, క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్టు ఇలా రకరకాలుగా వీడియోలు సృష్టించి లక్షల్లో వ్యూస్ సంపాదిస్తున్నారు. ఇవన్నీ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ట్రోలింగ్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న కొందరు యాంటీ ఫ్యాన్స్ తప్పుడు వీడియోలు చేయడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. తారక్ లాంటి హీరోలు స్పందిస్తోంది ఇందుకే. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే తర్వాత తీవ్ర నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో అందరికి ఇది ముప్పుగా మారుతుంది. ప్రతి ఒక్కరు కోర్టు మెట్లు ఎక్కి ప్రొటెక్షన్ కావాలని అడుగుతారు.

ఏదైనా సరే మితిమీరితే ఇలాగే ఉంటుంది. ఏఐ వరుస చూస్తే నిజమనిపిస్తోంది. ఉచితంగా ప్రో వెర్షన్లను సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వడం, ఎలా వాడుకోవాలో ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో టిప్స్ ఇవ్వడం లాంటివి నెటిజెన్లకు కొత్త విద్యలు నేర్పిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు ఉద్దేశం మంచిదే అయినప్పటికీ దాన్ని తప్పుడు పద్దతి కోసం వాడితే అనర్థాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. కొన్నేళ్ల క్రితం రష్మిక మందన్న, అలియా భట్ లాంటి వాళ్ళు డీప్ ఫేక్ వీడియోల వల్ల ఇబ్బంది పడ్డారు. ఈ మధ్యే అకీరానందన్, గౌతమ్ లను హీరోలుగా పెట్టి ఒకడు గంట యూట్యూబ్ ఏఐ సినిమా తీశాడు. భవిష్యత్తులో ఇంకెన్ని విపరీతాలు చూడాలో.

This post was last modified on December 8, 2025 10:16 pm

Share
Show comments
Published by
Kumar
Tags: NTR

Recent Posts

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

1 hour ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

4 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

6 hours ago

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…

7 hours ago

రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…

8 hours ago

నోటాతో పోటిపడ్డ నేతకు జగన్ రెడ్ కార్పెట్

ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న…

8 hours ago