కరోనా టైంలో అందరూ భయంతో వణికిన వాళ్లే. ఈ మహమ్మారి మొదట్లో జనాల్ని ఎంతగా కంగారు పెట్టేసిందో తెలిసిందే. తొలిసారి లాక్ డౌన్ విధించిన సమయంలో మెజారిటీ జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆర్థికంగా ఏ ఇబ్బంది లేని వాళ్లు, తమ అవసరాలు ఎలాగోలా తీరేవాళ్లు ఇల్లు దాటి బయట అడుగు పెట్టకుండా నెలలు నెలలు గడిపేశారు.
ముఖ్యంగా సెలబ్రెటీల్లో వయసు మళ్లిన వాళ్లు, అనారోగ్య సమస్యలున్నవాళ్లు ఎంతగానో నియంత్రణ పాటించారు. ఇళ్లకే పరిమితం అయ్యారు. ఐతే వారిలో చాలామంది గరిష్ఠంగా ఆరు నెలలు మాత్రమే నియంత్రణ పాటించి ఉంటారేమో. 70 ఏళ్లకు చేరువ అవుతూ, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఇటీవల ఇల్లు దాటి బయటికి వచ్చారు. తన రాజకీయ అరంగేట్రంపై అభిమానులతో సమావేశం నిర్వహించారు. దాని కంటే ముందే ఆయన బయటికి వచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
కానీ మలయాళ సూపర్ స్టార్లలో ఒకడైన మమ్ముట్టి మాత్రం కరోనా ప్రభావం మొదలైన దగ్గర్నుంచి ఏకంగా 9 నెలల పాటు పూర్తిగా ఇంటికి పరిమితం కావడం విశేషం. కరోనా టైంలో బయట తిరగకూడదని ఒక పట్టుదల పట్టిన ఆయన.. ఈ విషయంలో తనమీద తనకున్న నియంత్రణ ఎలాంటిదో చూపించాలనుకున్నారు. అందుకే ఇంటికి తనను బందీని చేసుకున్నారు.
ఇలాగే మూణ్నెల్లు కాదు.. ఆర్నెల్లు కాదు.. ఏకంగా తొమ్మిది నెలలు ఇంట్లోనే గడిపేశారు. మమ్ముట్టిని ఎవరైనా అత్యవసరంగా కలవాలంటే ఇంటికి వచ్చి కలిశారు తప్ప.. ఆయన మాత్రం బయటికి రాలేదు. ఇలా తొమ్మిది నెలల గృహవాసం పూర్తయ్యాక మమ్ముట్టి ఎట్టకేలకు బయటికి వచ్చారట. తన మిత్రులతో కలిసి ఒక టీ పార్టీ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టారట. త్వరలోనే ఆయన ఓ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
This post was last modified on December 8, 2020 2:15 pm
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…