కరోనా టైంలో అందరూ భయంతో వణికిన వాళ్లే. ఈ మహమ్మారి మొదట్లో జనాల్ని ఎంతగా కంగారు పెట్టేసిందో తెలిసిందే. తొలిసారి లాక్ డౌన్ విధించిన సమయంలో మెజారిటీ జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆర్థికంగా ఏ ఇబ్బంది లేని వాళ్లు, తమ అవసరాలు ఎలాగోలా తీరేవాళ్లు ఇల్లు దాటి బయట అడుగు పెట్టకుండా నెలలు నెలలు గడిపేశారు.
ముఖ్యంగా సెలబ్రెటీల్లో వయసు మళ్లిన వాళ్లు, అనారోగ్య సమస్యలున్నవాళ్లు ఎంతగానో నియంత్రణ పాటించారు. ఇళ్లకే పరిమితం అయ్యారు. ఐతే వారిలో చాలామంది గరిష్ఠంగా ఆరు నెలలు మాత్రమే నియంత్రణ పాటించి ఉంటారేమో. 70 ఏళ్లకు చేరువ అవుతూ, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఇటీవల ఇల్లు దాటి బయటికి వచ్చారు. తన రాజకీయ అరంగేట్రంపై అభిమానులతో సమావేశం నిర్వహించారు. దాని కంటే ముందే ఆయన బయటికి వచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
కానీ మలయాళ సూపర్ స్టార్లలో ఒకడైన మమ్ముట్టి మాత్రం కరోనా ప్రభావం మొదలైన దగ్గర్నుంచి ఏకంగా 9 నెలల పాటు పూర్తిగా ఇంటికి పరిమితం కావడం విశేషం. కరోనా టైంలో బయట తిరగకూడదని ఒక పట్టుదల పట్టిన ఆయన.. ఈ విషయంలో తనమీద తనకున్న నియంత్రణ ఎలాంటిదో చూపించాలనుకున్నారు. అందుకే ఇంటికి తనను బందీని చేసుకున్నారు.
ఇలాగే మూణ్నెల్లు కాదు.. ఆర్నెల్లు కాదు.. ఏకంగా తొమ్మిది నెలలు ఇంట్లోనే గడిపేశారు. మమ్ముట్టిని ఎవరైనా అత్యవసరంగా కలవాలంటే ఇంటికి వచ్చి కలిశారు తప్ప.. ఆయన మాత్రం బయటికి రాలేదు. ఇలా తొమ్మిది నెలల గృహవాసం పూర్తయ్యాక మమ్ముట్టి ఎట్టకేలకు బయటికి వచ్చారట. తన మిత్రులతో కలిసి ఒక టీ పార్టీ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టారట. త్వరలోనే ఆయన ఓ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
This post was last modified on December 8, 2020 2:15 pm
కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…