అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, సైరా లాంటి సినిమాలతో అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించడంతో బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరిగిపోతాయని అంతా అనుకున్నారు. కానీ అఖిల్ తొలి చిత్రం అఖిల్ను మించి ఇది డిజాస్టర్ అయింది. మొత్తంగా టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచింది.
ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. విడుదలకు ముందే ఏజెంట్ డిజిటల్ రైట్స్ అమ్ముడైనప్పటికీ.. థియేటర్లలో రిలీజైన రెండళ్లకు గానీ ఈ చిత్రం ఓటీటీలోకి రాలేకపోయింది. ఏజెంట్ అంత పెద్ద డిజాస్టర్ ఎందుకు అయిందో తెలుసుకోవడానికైనా ఓటీటీలో ఈ సినిమా చూద్దామని ఎదురు చూసి చూసి అలసిపోయారు జనం. ఏజెంట్ డిజిటల్ రిలీజ్ ఎందుకంత ఆలస్యం అయిందో దాని నిర్మాత అనిల్ సుంకర ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాను థియేట్రికల్ రిలీజ్కు ముందే ఒక వ్యక్తికి డిజిటల్ రైట్స్ అమ్మానని.. అతను తర్వాత సోనీ లివ్ వాళ్లకు హక్కులు అమ్ముకున్నాడని అనిల్ వెల్లడించారు. ఐతే ఆ రెండు వర్గాల మధ్య గొడవ తలెత్తిందని.. ఒక ఫేక్ కేస్ వల్ల డిజిటల్ రిలీజ్ ఆగిందని అనిల్ తెలిపారు. ఏజెంట్ హిందీ వెర్షన్ మాత్రం ఓటీటీలోకి వచ్చేసిందని.. తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేసుకుని ఉంటే ఏ ఇబ్బందీ ఉండేది కాదని.. కానీ సోనీ లివ్ వాళ్లు కేసు విషయంలో భయపడి స్ట్రీమింగ్ వాయిదా వేశారని చెప్పారు అనిల్.
ఆ కేసులో న్యాయం లేదని తెలిసినా.. తాను అందులో జోక్యం చేసుకోలేకపోయానని అనిల్ తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతోందని తాను రైట్స్ అమ్మిన వ్యక్తిని అడిగితే.. ఈ సినిమా హక్కుల వల్ల తాను నష్టపోయానంటూ తన మీదికి వస్తాడని, అందుకే తాను ఆ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండిపోయానని అనిల్ వెల్లడించారు. ఇక ఏజెంట్ మిస్ ఫైర్ కావడం గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకు మొదట్నుంచి ఏదీ కలిసి రాలేదన్నారు. ఎంతో ఎనర్జీతో సినిమాను మొదలుపెట్టినప్పటికీ.. అనుకున్నట్లుగా సినిమా తీయలేకపోయామని.. కొవిడ్ సహా అనేక కారణాలతో సినిమా దెబ్బ తిందని ఆయన చెప్పారు.
This post was last modified on December 7, 2025 10:40 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…