అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, సైరా లాంటి సినిమాలతో అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించడంతో బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరిగిపోతాయని అంతా అనుకున్నారు. కానీ అఖిల్ తొలి చిత్రం అఖిల్ను మించి ఇది డిజాస్టర్ అయింది. మొత్తంగా టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచింది.
ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. విడుదలకు ముందే ఏజెంట్ డిజిటల్ రైట్స్ అమ్ముడైనప్పటికీ.. థియేటర్లలో రిలీజైన రెండళ్లకు గానీ ఈ చిత్రం ఓటీటీలోకి రాలేకపోయింది. ఏజెంట్ అంత పెద్ద డిజాస్టర్ ఎందుకు అయిందో తెలుసుకోవడానికైనా ఓటీటీలో ఈ సినిమా చూద్దామని ఎదురు చూసి చూసి అలసిపోయారు జనం. ఏజెంట్ డిజిటల్ రిలీజ్ ఎందుకంత ఆలస్యం అయిందో దాని నిర్మాత అనిల్ సుంకర ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాను థియేట్రికల్ రిలీజ్కు ముందే ఒక వ్యక్తికి డిజిటల్ రైట్స్ అమ్మానని.. అతను తర్వాత సోనీ లివ్ వాళ్లకు హక్కులు అమ్ముకున్నాడని అనిల్ వెల్లడించారు. ఐతే ఆ రెండు వర్గాల మధ్య గొడవ తలెత్తిందని.. ఒక ఫేక్ కేస్ వల్ల డిజిటల్ రిలీజ్ ఆగిందని అనిల్ తెలిపారు. ఏజెంట్ హిందీ వెర్షన్ మాత్రం ఓటీటీలోకి వచ్చేసిందని.. తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేసుకుని ఉంటే ఏ ఇబ్బందీ ఉండేది కాదని.. కానీ సోనీ లివ్ వాళ్లు కేసు విషయంలో భయపడి స్ట్రీమింగ్ వాయిదా వేశారని చెప్పారు అనిల్.
ఆ కేసులో న్యాయం లేదని తెలిసినా.. తాను అందులో జోక్యం చేసుకోలేకపోయానని అనిల్ తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతోందని తాను రైట్స్ అమ్మిన వ్యక్తిని అడిగితే.. ఈ సినిమా హక్కుల వల్ల తాను నష్టపోయానంటూ తన మీదికి వస్తాడని, అందుకే తాను ఆ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండిపోయానని అనిల్ వెల్లడించారు. ఇక ఏజెంట్ మిస్ ఫైర్ కావడం గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకు మొదట్నుంచి ఏదీ కలిసి రాలేదన్నారు. ఎంతో ఎనర్జీతో సినిమాను మొదలుపెట్టినప్పటికీ.. అనుకున్నట్లుగా సినిమా తీయలేకపోయామని.. కొవిడ్ సహా అనేక కారణాలతో సినిమా దెబ్బ తిందని ఆయన చెప్పారు.
This post was last modified on December 7, 2025 10:40 pm
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…