నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ-2’ అనూహ్య పరిణామాల మధ్య వాయిదా పడిపోయిన సంగతి తెలిసిందే. ఒక రోజు ఆలస్యంగా అయినా సినిమా రిలీజవుతుందేమో అని అభిమానులు ఆశించారు కానీ.. అలా జరగలేదు. ఈ వీకెండ్ సినిమా రాదని తేలిపోయాక.. కొత్త డేట్ ఏదా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఒక వారం ఆలస్యంగా రిలీజవుతుందన్నారు కానీ.. అది కష్టమే అనిపిస్తోంది.
‘అఖండ-2’ వస్తే నాలుగు సినిమాలు డిసెంబరు 12 నుంచి వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అంతే కాక ‘అఖండ-2’ టీంకు కూడా హడావుడి తప్పదు. కాబట్టే ఈ డేట్ను వదిలేసినట్లే తెలుస్తోంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 రిలీజ్ పట్ల విముఖతతోనే ఉన్నారట. వాళ్లతో పాటు అభిమానులు ఎక్కువగా కోరుకుంటున్న డేట్.. డిసెంబరు 25 అని తెలుస్తోంది.
అఖండ-2 లాంటి పెద్ద సినిమాకు ఫెస్టివల్ సీజనే కరెక్ట్ అన్నది మెజారిటీ అభిప్రాయం. అలా అని సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలంటే చాలా కష్టమే. అక్కడ ఆల్రెడీ బెర్తులు ఓవర్ క్రౌడ్ అయిపోయాయి. క్రిస్మస్కు ఇతర భాషల్లోనూ భారీ చిత్రాలు లేవు. తెలుగు విషయానికి వస్తే ఛాంపియన్, శంబాల మూవీస్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఎక్కువ రోజులు సెలవులున్న ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకో రెండు సినిమాలను రిలీజ్ చేసినా ఇబ్బంది ఉండదు. 19న అంటే ‘అవతార్-3’తో సమస్య తప్పదు. ముఖ్యంగా యుఎస్లో కోరుకున్నన్ని స్క్రీన్లు దొరకవు. అందుకే ఎక్కువమంది డిస్ట్రిబ్యూటర్లు డిసెంబరు 25న సినిమాను రిలీజ్ చేయాలని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ రోజు హైదరాబాద్లో ‘అఖండ-2’ డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కొందరు ఇండస్ట్రీ పెద్దలు కూడా హాజరవుతున్నారు. ఏది బెస్ట్ డేట్ అనే విషయాన్ని చర్చించడంతో పాటు ముందు చేసుకున్న అగ్రిమెంట్లను రివైజ్ చేయడం మీదా మాట్లాడుకోబోతున్నారు. ఈ సమావేశం అయ్యాక ఈ రోజు లేదా ఒకట్రెండు రోజుల్లో రిలీజ్ డేట్ ఫైనలైజ్ చేసి ప్రకటన చేస్తారని సమాచారం. డిసెంబరు 25 డేట్ను ఎంచుకునే అవకాశాలు ఎక్కువ.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…