నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ-2’ అనూహ్య పరిణామాల మధ్య వాయిదా పడిపోయిన సంగతి తెలిసిందే. ఒక రోజు ఆలస్యంగా అయినా సినిమా రిలీజవుతుందేమో అని అభిమానులు ఆశించారు కానీ.. అలా జరగలేదు. ఈ వీకెండ్ సినిమా రాదని తేలిపోయాక.. కొత్త డేట్ ఏదా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఒక వారం ఆలస్యంగా రిలీజవుతుందన్నారు కానీ.. అది కష్టమే అనిపిస్తోంది.
‘అఖండ-2’ వస్తే నాలుగు సినిమాలు డిసెంబరు 12 నుంచి వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అంతే కాక ‘అఖండ-2’ టీంకు కూడా హడావుడి తప్పదు. కాబట్టే ఈ డేట్ను వదిలేసినట్లే తెలుస్తోంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 రిలీజ్ పట్ల విముఖతతోనే ఉన్నారట. వాళ్లతో పాటు అభిమానులు ఎక్కువగా కోరుకుంటున్న డేట్.. డిసెంబరు 25 అని తెలుస్తోంది.
అఖండ-2 లాంటి పెద్ద సినిమాకు ఫెస్టివల్ సీజనే కరెక్ట్ అన్నది మెజారిటీ అభిప్రాయం. అలా అని సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలంటే చాలా కష్టమే. అక్కడ ఆల్రెడీ బెర్తులు ఓవర్ క్రౌడ్ అయిపోయాయి. క్రిస్మస్కు ఇతర భాషల్లోనూ భారీ చిత్రాలు లేవు. తెలుగు విషయానికి వస్తే ఛాంపియన్, శంబాల మూవీస్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఎక్కువ రోజులు సెలవులున్న ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకో రెండు సినిమాలను రిలీజ్ చేసినా ఇబ్బంది ఉండదు. 19న అంటే ‘అవతార్-3’తో సమస్య తప్పదు. ముఖ్యంగా యుఎస్లో కోరుకున్నన్ని స్క్రీన్లు దొరకవు. అందుకే ఎక్కువమంది డిస్ట్రిబ్యూటర్లు డిసెంబరు 25న సినిమాను రిలీజ్ చేయాలని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ రోజు హైదరాబాద్లో ‘అఖండ-2’ డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కొందరు ఇండస్ట్రీ పెద్దలు కూడా హాజరవుతున్నారు. ఏది బెస్ట్ డేట్ అనే విషయాన్ని చర్చించడంతో పాటు ముందు చేసుకున్న అగ్రిమెంట్లను రివైజ్ చేయడం మీదా మాట్లాడుకోబోతున్నారు. ఈ సమావేశం అయ్యాక ఈ రోజు లేదా ఒకట్రెండు రోజుల్లో రిలీజ్ డేట్ ఫైనలైజ్ చేసి ప్రకటన చేస్తారని సమాచారం. డిసెంబరు 25 డేట్ను ఎంచుకునే అవకాశాలు ఎక్కువ.
This post was last modified on December 7, 2025 2:22 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…