ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ కుర్రాడు కెరీర్ ప్రారంభంలో కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలే చేశాడు. అత్తగారు స్వాగతం, రౌడీ బాబాయ్, ఇంటి దొంగ, దొంగ కాపురం, జీవన గంగ లాంటివి కమర్షియల్ గా బాగానే పే చేశాయి. కానీ తర్వాత వరస ఫెయిల్యూర్స్ రావడంతో త్వరగానే ఇండస్ట్రీ నుంచి మాయమైపోయాడు. లంకేశ్వరుడులో చిరంజీవి చెల్లెలు రేవతి భర్తగా పోలీస్ ఆఫీసర్ వేషంలో కనిపించాక కళ్యాణ చక్రవర్తి దర్శనం మళ్ళీ జరగలేదు.
ఇప్పుడు 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెరమీద కళ్యాణ చక్రవర్తి కనిపించనున్నాడు. రోషన్ మేక హీరోగా రూపొందుతున్న ఛాంపియన్ లో రాజి రెడ్డి అనే కీలక పాత్రలో నటించాడు. ఈ మేరకు ఫస్ట్ లుక్ కూడా వదిలారు. పోస్టర్ లో ముప్పై అయిదు అని నెంబర్ వేశారు కానీ నిజానికి ఇంకో రెండేళ్లు ఎక్కువే అయ్యింది. డిసెంబర్ 25 విడుదల కాబోతున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీని వైజయంతి, స్వప్న సంస్థలు నిర్మించాయి. సుదీర్ఘ నిర్మాణం జరుపుకున్న ఛాంపియన్ లో కల్యాణ చక్రవర్తిని చూసి నందమూరి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. బాలయ్యకు తమ్ముడు వరస కాబట్టి కనెక్టివిటీ ఉంటుంది.
ఈ మధ్య ఇలా తెరమరుగైపోయిన పాత హీరోలను బాగానే తీసుకొస్తున్నారు. స్కందలో రామ్ తండ్రిగా నటించిన దగ్గుబాటి రాజా ఈ కోవకు చెందినవాడే. రవితేజ రామారావు ఆన్ డ్యూటీలో వేణు రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితం దక్కపోవడంతో మళ్ళీ తెరమీద కనిపించలేదు. కళ్యాణ్ చక్రవర్తి సోదరుడు హరిన్ చక్రవర్తి యాక్సిడెంట్ లో చనిపోవడం ఆ కుటుంబం మీద తీవ్ర ప్రభావం చూపించింది. కళ్యాణ్ కొడుకు పృథ్వి సైతం రోడ్డు ప్రమాదంలోనే కన్ను మూశారు. చెన్నైలో రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు చేసుకుంటున్న సీనియర్ హీరో కంబ్యాక్ ని కొనసాగిస్తారో లేదో చూడాలి.
This post was last modified on December 6, 2025 6:16 pm
మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…