ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ నిన్న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తో వసూళ్లు పెంచుకుంటోంది. ఆయన పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న సైకో కిల్లర్ పాత్ర చేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. గతంలో స్వలింగసంపర్కుడిగా నటించి ఆశ్చర్యపరిచిన మమ్ముట్టి ఇప్పుడీ క్యారెక్టర్ తో ఇంకో షాక్ ఇచ్చారు. దీంతో కొందరు ఒక మన సీనియర్ స్టార్లు కూడా ఇలా వయసుకు తగ్గట్టు కొత్త ప్రయోగాలు చేయాలని, ఎప్పుడూ మాస్ అంటూ మూసలో ఉండకూడదని సోషల్ మీడియాలో మమ్ముట్టితో పోలిక తెస్తున్నారు.
ఇది ముమ్మాటికీ రాంగే. ఎందుకంటే కేరళ, ఏపీ – తెలంగాణ ఆడియన్స్ అభిరుచుల్లో చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉండటం వల్ల క్లాస్ కంటెంట్ కి ఆదరణ దక్కడం సహజం అందుకే ఎక్కువ ఇంగ్లీష్ టైటిల్స్ పెడతారు. అందులోనూ గత అయిదేళ్లలో సైకో కిల్లింగ్ జానర్లో అక్కడ చాలా సినిమాలు వచ్చాయి. సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. కానీ మన ప్రేక్షకులకు ఆ జానర్ సూటవ్వదు. అందుకే అరుదుగా అలాంటి ఎక్స్ పరిమెంట్లు జరుగుతాయి. అప్పుడెప్పుడో భూమిక అనసూయ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు లాంటి కొన్ని హిట్లు మాత్రమే కనిపిస్తాయి. ఇది మనకు వాళ్లకు ఉన్న వ్యత్యాసం.
ఇక పోలిక విషయానికి వస్తే మనకు మాస్ సపోర్ట్ ఎక్కువ. ప్రయోగాలతో ఆ సెక్షన్ ఆడియన్స్ ని మెప్పించలేం. అందుకే చిరంజీవి నయనతారతో డ్యూయెట్ పాడాలి, బాలయ్య సంయుక్త మీనన్ తో డాన్స్ చేయాలి. అప్పుడే విజిల్స్ క్లాప్స్ పడతాయి. వెంకటేష్, నాగార్జున కూడా దీనికి మినహాయింపు కాదు. సేఫ్ గేమ్ నుంచి బయటికి వద్దామని చేసిన కుబేర, సైంధవ్ లాంటివి స్వంత ఫ్యాన్స్ కే నచ్చలేదు. నా సామిరంగాలో అల్లరి ఎంజాయ్ చేసిన అభిమానులు కూలిలో విలనిజంని ఒప్పుకోలేదు. మనకు ఆవనూనెతో చేసిన ఆవకాయ పచ్చడి ఇష్టం. కేరళ వాళ్ళకు కొబ్బరినూనెతో వండిన పదార్థాలు ఇష్టం. ఎవరి టేస్టు వాళ్లదే. అందరూ రైటే.
This post was last modified on December 6, 2025 2:12 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…