Movie News

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సినిమా టికెట్ల ధరలను సమయానుకూలంగా పెంచుతూనే ఉన్నాయి. అయినా కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు వచ్చాయంటే చాలు.. అదనపు రేట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు నిర్మాతలు. వారం పది రోజులు రేట్లు పెరిగిపోతున్నాయి. 

బెనిఫిట్ షోల పేరుతో మరింతగా ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్నారనే చర్చా జరుగుతోంది. ఏవో కొన్ని పెద్ద సినిమాలకే కదా రేట్లు పెంచుతున్నాం అంటున్నారు కానీ.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూడాలనుకుంటున్నదే ఆ కొన్ని సినిమాలను. వాటికే రేట్లు పెంచి వారిని నిరుత్సాహ పరిస్తే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐతే నిర్మాతలు మాత్రం ఒక టికెట్ రేటు మీద తమకు వచ్చే ఆదాయం చాలా తక్కువ అని వాదిస్తున్నారు. తాజాగా నిర్మాత బన్నీ వాసు మీడియాముందు ఇదే వాదన చేశారు.

‘‘మీడియా వాళ్లు కూడా జనాల్లోకి తీసుకెళ్లాల్సింది ఏంటంటే.. మొన్న చాలా క్లియర్‌గా లెక్కగట్టామండీ. ఒక టికెట్ మీద 28 శాతం కంటే తక్కువ నిర్మాత చేతికి వస్తోంది. అంటే 100 రూపాయల్లో అన్నీ పోను నిర్మాత ఇంటికి తీసుకెళ్లేది 28 రూపాయలే. దాంట్లోంచి మళ్లీ ఆ సినిమా నుంచి మిగిలితే మేం 35-40 శాతం ఆదాయపు పన్ను కడతాం.

ఇవన్నీ పక్కన పెడితే టికెట్ రేటు 600 కావచ్చు.. 800 కావచ్చు.. ఆ డబ్బులు అన్నీ నిర్మాతే తినేస్తున్నాడు అనుకుంటారు. మీడియా వాళ్లు ప్రేక్షకులకు సపోర్ట్ చేస్తున్నారు.. మీరు కూడా మా కుటుంబంలో భాగమే కాబట్టి మా వైపు నుంచి కూడా ఆలోచించి 600 రూపాయల్లో ఎవరికి ఎంత వెళ్తోంది అనేది విశ్లేషించి జనాలకు చెబితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం’’ అని బన్నీ వాసు వివరించాడు. ‘అఖండ-2’కు రేట్ల పెంపుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్న నేపథ్యంలో బన్నీ వాసు ఇలా స్పందించాడు.

This post was last modified on December 4, 2025 3:51 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Bunny Vas

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

5 minutes ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

1 hour ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

1 hour ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

3 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

3 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

4 hours ago