హృతిక్ రోషన్కు డెబ్యూ మూవీ కహోనా ప్యార్ హై తర్వాత పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా.. కోయీ మిల్ గయా. దీనికి కొనసాగింపుగా వచ్చిన క్రిష్, క్రిష్-3 కూడా ఘనవిజయం సాధించాయి. ఈ ఫ్రాంఛైజీలో భాగంగా మరింత భారీగా క్రిష్-4 చేయడానికి చాలా ఏళ్ల ముందే సన్నాహాలు మొదలుపెట్టాడు హృతిక్ తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్. ఈ చిత్రానికి ఎప్పుడో స్క్రిప్టు కూడా రెడీ అయింది. కానీ ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మధ్యలో రాకేష్ క్యాన్సర్ బారిన పడడం వల్ల ఈ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. ఆయన కోలుకుని సినిమా తీయడానికి రెడీ అయ్యారు.
అయినా క్రిష్-4 కార్యరూపం దాల్చలేదు. అందుకు కారణమేంటో ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు రాకేష్ రోషన్. బడ్జెట్ సమస్యల వల్లే క్రిష్-4ను సెట్స్ మీదికి తీసుకెళ్లలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. క్రిష్-4ను అంతర్జాతీయ ప్రమాణాలతోనే తీయాల్సి ఉంటుందని.. అందుకోసం భారీ బడ్జెట్ అవసరమని.. కానీ తాము అనుకున్న బడ్జెట్లో సినిమా తీయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఆయన వెల్లడించారు.
మధ్యలో హృతిక్ రోషన్ స్వయంగా ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పటిదాకా ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లట్లేదు. కారణం ఆర్థిక సమస్యలే అని తెలుస్తోంది. ఐతే ఇంతకుముందు క్రిష్ సిరీస్లో వచ్చిన మూడు సినిమాలనూ రోషన్ ఫ్యామిలీనే నిర్మించడం గమనార్హం. కానీ క్రిష్-4 మీద డబ్బులు పెట్టలేకపోతోంది. ఐతే హృతిక్ తండ్రి ఈ విషయంలో ఇబ్బంది పడుతుండగా.. హృతిక్ మాత్రం సొంతంగా భారీ పెట్టుబడులు పెడుతుండడం విశేషం.
తాజాగా అతను ముంబయిలోని జుహులో ఒక ప్రీమియం ప్రాపర్టీ కొన్నాడు. రెండు ఫ్లోర్లతో ఉన్న ఆ ప్రాపర్టీ కోసం అతను ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించాడట. 7 వేల చదరపు అడుగుల లగ్జరీ ప్రాపర్టీ ఇదని సమాచారం. ఓవైపు క్రిష్-4 తీయడానికి డబ్బులు సమకూరట్లేదని రాకేష్ బాధ పడుతుంటే.. హృతిక్ ఇలా లగ్జరీ ప్రాపర్టీ కొనడం బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. ఐతే క్రిష్ సిరీస్లో ఇప్పటిదాకా తీసిన సినిమాలు వేరు.. క్రిష్-4 వేరని తెలుస్తోంది. దాని కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడంతో హృతిక్ మార్కెట్ దృష్ట్యా అంత బడ్జెట్ పెట్టడానికి వేరే నిర్మాతలు ముందుకు రాలేదని తెలుస్తోంది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…