బయట చాలా మంది జనాల్లో ఒక అపోహ ఉంది. స్టార్ హీరోలు పదులు, వందల కోట్ల రెమ్యునరేషన్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని, డబ్బే ప్రపంచంగా ఉంటారని, దాన్ని వసూలు చేసుకోవడం కోసం నిర్మాతను పీడిస్తారనే అభిప్రాయం చాలాసార్లు సోషల్ మీడియాలో చూశాం. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని రాబిన్ హుడ్ గా వర్ణించిన వాళ్ళు సందర్భంతో సంబంధం లేకుండా పారితోషికాల టాపిక్ తెచ్చి హడావిడి చేయబోయారు. కానీ మన టాలీవుడ్ స్టార్లు ఎంత గోల్డో ఇవాళ ఆంధ్రకింగ్ తాలూకా సక్సెస్ మీట్ లో నిర్మాత మైత్రి రవిశంకర్ చెప్పాక క్లారిటీ వచ్చింది. పేరుపేరునా ఉదాహరణలు చెప్పారు.
రంగస్థలం టైంలో రామ్ చరణ్ కు రావాల్సిన నాలుగు కోట్లు ఆయన చేతికి చేరడానికి రెండేళ్లు పట్టినా పెద్దగా పట్టించుకోలేదు. అదే బ్యానర్ భాగస్వామ్యంలో ఇప్పుడు పెద్ది చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏకంగా మీకు మిగిలితే ఇవ్వండి లేదంటే లేదు అని చెప్పడం మాములు విషయం కాదు. ఆంధ్రకింగ్ తాలూకాకు డబ్బు బదులు కంటెంట్ మీద నమ్మకంతో రామ్ రెండు ఏరియాల హక్కులు తీసుకున్నాడు. పుష్ప బ్యాలన్స్ సొమ్ముని అల్లు అర్జున్ కి ఏడాది టైంలో ఇచ్చినా లైట్ తీసుకున్నాడు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు ఎప్పుడుంటే అప్పుడే ఇవ్వండి అనే టైపు. వాల్తేరు వీరయ్యకు చిరంజీవి అదే చేశారు.
ఇన్ని ఎగ్జాంపుల్స్ చెబితే వాళ్ళను గోల్డ్ అనకుండా ఏమంటాం. కొన్నిసార్లు సినిమాలు డిజాస్టర్ అయినప్పుడు ప్రొడ్యూసర్లు బాకీలు చెల్లించలేని స్థితిలో ఉంటారు. గతంలో ఇలాంటివి జరిగినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ రివర్స్ లో సహాయం చేసేవారని అప్పట్లో చెప్పుకునేవారు. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు మార్కెట్ కు తగ్గట్టే పారితోషికాలు తీసుకుంటారు కానీ ఊరికే లేనిపోని డిమాండ్ చేయరు. మైత్రి రవిశంకర్ చెప్పింది తనవరకు ఎదురైన అనుభవాలే అయినా కూడా మిగిలిన నిర్మాణ సంస్థలకు సైతం ఇదే ఎక్స్ పీరియన్స్ ఉంటుంది. ఫ్యాన్స్ తమ హీరోల గొప్పదనం చూసి మురిసిపోతున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…