రాజమౌళి తన వారణాసిలో మహేష్ బాబుని రాముడిగా చూపిస్తున్నట్టు అధికారికంగా వెల్లడయ్యాక అందరి చూపు బాలీవుడ్ రామాయణ మీదకు వెళ్తోంది. ఎందుకంటే వచ్చే ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ ఏకంగా నాలుగు వేల కోట్లతో రూపొందుతోందని ఇప్పటికే టాక్ ఉంది. రాముడిగా రన్బీర్ కపూర్ లుక్ ఎలా ఉంటుంది, ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తాడనే దాని మీద బాలీవుడ్ వర్గాల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి. రిలీజయ్యేది మొదటి భాగమే కాబట్టి దాంతో ఏర్పడే హైప్ తో పార్ట్ 2ని ఇంకా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలన్నది దర్శకుడు నితీష్ తివారి ఆలోచన. ఇక్కడిదాకా బాగానే ఉంది.
మహేష్ బాబు, రన్బీర్ కపూర్ లో ఎవరు రాముడిగా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారనే డిబేట్ నిజానికి అనవసరం. ఎందుకంటే వారణాసిలో మహేష్ కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమే సీతాసతుడిగా కనిపిస్తాడు. మిగిలినదంతా వర్తమానం, గతం, భవిష్యత్తు మీద విభిన్న బ్యాక్ డ్రాప్స్ లో ఉంటుంది. సో రాముడి లెన్త్ పరిమితం కాబట్టి అతిగా ఊహించుకోవడానికి లేదు. అలాని పావు గంటైనా అరగంటైనా రాజమౌళి ఇచ్చే ఇంపాక్ట్ మాములుగా ఉండదు. కానీ హిందీ రామాయణ అలా కాదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి శుభం కార్డు దాకా రన్బీర్ కపూర్ రాముడిగానే ఉంటాడు. ఇంకెలాంటి డైవెర్షన్లు ఇతరత్రా సెటప్ లు ఉండవు.
అయినా రాముడిగా కేవలం ఒక్కరు మాత్రం పర్ఫెక్ట్ ఛాయస్ అవుతారని చెప్పడానికి లేదు. ఎందుకంటే లవకుశలో రాముడి రూపంలో ఎన్టీఆర్ ని చూశాక చాలా ఏళ్ళ పాటు వేరొకరు ఆ పాత్ర ధరించే సాహసం చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత శోభన్ బాబు సంపూర్ణ రామాయణంలో శబాష్ అనిపించుకున్నారు. శ్రీరామరాజ్యంలో బాలకృష్ణకు మంచి మార్కులు పడ్డాయి. శ్రీరామదాసులో సుమన్ రైట్ ఛాయస్ అనిపించుకున్నారు. ఓం రౌత్ సరిగా తీయలేదు కానీ ఆదిపురుష్ లో ప్రభాస్ కూడా బెస్ట్ అనిపించుకునేవాడు. సో రేపు రన్బీర్ అయినా మహేష్ అయినా దర్శకులు ఎలా ప్రెజెంట్ చేస్తారనేది విజయాన్ని శాశించనుంది.
This post was last modified on November 27, 2025 10:33 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…