Movie News

బాలయ్య గ్రీన్ మ్యాట్ పంచులు భేష్

అప్పుడప్పుడు అభిమానుల పట్ల కాస్త దూకుడుగా ఉన్నా ఏదైనా ఓపెన్ గా మాట్లాడతారని బాలయ్యకు పేరుంది. ఒక్కోసారి మిస్ ఫైర్ అయినా సరే ఆయనేమి మొహమాటపడడు. తాజాగా ఇప్పటి హీరోల ధోరణి గురించి వేసిన పంచులు చర్చనీయాంశం అయ్యేలా ఉన్నాయి. తాను కేవలం ఎన్టీఆర్ వారసుడిగా ఎదగలేదని, కస్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని, సినిమాల పట్ల జ్ఞానం కసి తపన ఇంతవాడిని చేశాయని, కానీ ఇప్పుడంతా టెక్నాలజీ మయం అయిపోయి ఒరిజినాలిటీ కనిపించడం లేదని, సెట్స్ కి రాకుండా గ్రీన్ మ్యాట్స్ లో షూటింగ్ చేస్తున్న హీరోల్లా తాను డూప్లికేట్ కాదని, ఒరిజినల్ అని కుండబద్దలు కొట్టేశారు.

ఎవరి పేరు ప్రస్తావించలేదు కానీ బాలకృష్ణ మాటల్లో నిజాలు లేకపోలేదు. కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ హష్మీ సైతం ఇదే తరహాలో మాట్లాడాడు. షూటింగ్ కి రాకుండా మేనేజ్ చేస్తున్న హీరోలను చూస్తున్నానని పెద్ద బాంబు వేశాడు. ఇప్పుడు బాలయ్య దాన్ని డిస్కషన్ వైపు మళ్లించారు. సాంకేతికత పెరిగిపోయి ఏఐ లాంటివి వచ్చాక నిజమేదో అబద్దమేదో గుర్తించడం ప్రేక్షకులకు కష్టంగా మారింది. నిజంగా తాము అభిమానించే హీరోనే ఫైట్లు చేశాడా లేక డూప్ ని పెట్టి ఏఐతో మేనేజ్ చేశారా అనేది సామాన్యులు పసిగట్టలేకపోతున్నారు. దీని వల్ల ఆడియన్స్ ని మోసం చేయడం మరింత తేలికైపోయింది.

రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయం. మేడం టుస్సాడ్ మ్యూజియం కోసం ముఖకవళికలు, శరీర కొలతలు తీసుకున్నట్టు భవిష్యత్తులో స్టార్ హీరోలకు ఇలాగే తీసుకుని ఏకంగా ఏఐ లోనే సినిమా తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు సీనియర్లకు ఇలాంటి సౌలభ్యాలు లేవు. చిరంజీవి నిజంగానే రైల్వే బ్రిడ్జి మీద వేలాడాల్సి వచ్చింది. బాలకృష్ణ కురూపి వేషంలో ముప్పై సంవత్సరాల క్రితం క్లిష్టమైన ప్రోస్తెటిక్స్ మేకప్ వేసుకున్నారు. కమల్ హాసన్, విక్రమ్ సంగతి సరేసరి. ఇప్పటి హీరోలకు అంత సవాళ్లు, ఛాలెంజులు లేవన్నది బాలయ్య ఉద్దేశం. టెక్నాలజి చేస్తున్న ముప్పుని బాగానే పసిగట్టారు.

This post was last modified on November 22, 2025 6:12 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Balakrishna

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

6 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

32 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago