అప్పుడప్పుడు అభిమానుల పట్ల కాస్త దూకుడుగా ఉన్నా ఏదైనా ఓపెన్ గా మాట్లాడతారని బాలయ్యకు పేరుంది. ఒక్కోసారి మిస్ ఫైర్ అయినా సరే ఆయనేమి మొహమాటపడడు. తాజాగా ఇప్పటి హీరోల ధోరణి గురించి వేసిన పంచులు చర్చనీయాంశం అయ్యేలా ఉన్నాయి. తాను కేవలం ఎన్టీఆర్ వారసుడిగా ఎదగలేదని, కస్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని, సినిమాల పట్ల జ్ఞానం కసి తపన ఇంతవాడిని చేశాయని, కానీ ఇప్పుడంతా టెక్నాలజీ మయం అయిపోయి ఒరిజినాలిటీ కనిపించడం లేదని, సెట్స్ కి రాకుండా గ్రీన్ మ్యాట్స్ లో షూటింగ్ చేస్తున్న హీరోల్లా తాను డూప్లికేట్ కాదని, ఒరిజినల్ అని కుండబద్దలు కొట్టేశారు.
ఎవరి పేరు ప్రస్తావించలేదు కానీ బాలకృష్ణ మాటల్లో నిజాలు లేకపోలేదు. కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ హష్మీ సైతం ఇదే తరహాలో మాట్లాడాడు. షూటింగ్ కి రాకుండా మేనేజ్ చేస్తున్న హీరోలను చూస్తున్నానని పెద్ద బాంబు వేశాడు. ఇప్పుడు బాలయ్య దాన్ని డిస్కషన్ వైపు మళ్లించారు. సాంకేతికత పెరిగిపోయి ఏఐ లాంటివి వచ్చాక నిజమేదో అబద్దమేదో గుర్తించడం ప్రేక్షకులకు కష్టంగా మారింది. నిజంగా తాము అభిమానించే హీరోనే ఫైట్లు చేశాడా లేక డూప్ ని పెట్టి ఏఐతో మేనేజ్ చేశారా అనేది సామాన్యులు పసిగట్టలేకపోతున్నారు. దీని వల్ల ఆడియన్స్ ని మోసం చేయడం మరింత తేలికైపోయింది.
రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయం. మేడం టుస్సాడ్ మ్యూజియం కోసం ముఖకవళికలు, శరీర కొలతలు తీసుకున్నట్టు భవిష్యత్తులో స్టార్ హీరోలకు ఇలాగే తీసుకుని ఏకంగా ఏఐ లోనే సినిమా తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు సీనియర్లకు ఇలాంటి సౌలభ్యాలు లేవు. చిరంజీవి నిజంగానే రైల్వే బ్రిడ్జి మీద వేలాడాల్సి వచ్చింది. బాలకృష్ణ కురూపి వేషంలో ముప్పై సంవత్సరాల క్రితం క్లిష్టమైన ప్రోస్తెటిక్స్ మేకప్ వేసుకున్నారు. కమల్ హాసన్, విక్రమ్ సంగతి సరేసరి. ఇప్పటి హీరోలకు అంత సవాళ్లు, ఛాలెంజులు లేవన్నది బాలయ్య ఉద్దేశం. టెక్నాలజి చేస్తున్న ముప్పుని బాగానే పసిగట్టారు.
This post was last modified on November 22, 2025 6:12 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…