Movie News

బాలయ్య గ్రీన్ మ్యాట్ పంచులు భేష్

అప్పుడప్పుడు అభిమానుల పట్ల కాస్త దూకుడుగా ఉన్నా ఏదైనా ఓపెన్ గా మాట్లాడతారని బాలయ్యకు పేరుంది. ఒక్కోసారి మిస్ ఫైర్ అయినా సరే ఆయనేమి మొహమాటపడడు. తాజాగా ఇప్పటి హీరోల ధోరణి గురించి వేసిన పంచులు చర్చనీయాంశం అయ్యేలా ఉన్నాయి. తాను కేవలం ఎన్టీఆర్ వారసుడిగా ఎదగలేదని, కస్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని, సినిమాల పట్ల జ్ఞానం కసి తపన ఇంతవాడిని చేశాయని, కానీ ఇప్పుడంతా టెక్నాలజీ మయం అయిపోయి ఒరిజినాలిటీ కనిపించడం లేదని, సెట్స్ కి రాకుండా గ్రీన్ మ్యాట్స్ లో షూటింగ్ చేస్తున్న హీరోల్లా తాను డూప్లికేట్ కాదని, ఒరిజినల్ అని కుండబద్దలు కొట్టేశారు.

ఎవరి పేరు ప్రస్తావించలేదు కానీ బాలకృష్ణ మాటల్లో నిజాలు లేకపోలేదు. కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ హష్మీ సైతం ఇదే తరహాలో మాట్లాడాడు. షూటింగ్ కి రాకుండా మేనేజ్ చేస్తున్న హీరోలను చూస్తున్నానని పెద్ద బాంబు వేశాడు. ఇప్పుడు బాలయ్య దాన్ని డిస్కషన్ వైపు మళ్లించారు. సాంకేతికత పెరిగిపోయి ఏఐ లాంటివి వచ్చాక నిజమేదో అబద్దమేదో గుర్తించడం ప్రేక్షకులకు కష్టంగా మారింది. నిజంగా తాము అభిమానించే హీరోనే ఫైట్లు చేశాడా లేక డూప్ ని పెట్టి ఏఐతో మేనేజ్ చేశారా అనేది సామాన్యులు పసిగట్టలేకపోతున్నారు. దీని వల్ల ఆడియన్స్ ని మోసం చేయడం మరింత తేలికైపోయింది.

రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయం. మేడం టుస్సాడ్ మ్యూజియం కోసం ముఖకవళికలు, శరీర కొలతలు తీసుకున్నట్టు భవిష్యత్తులో స్టార్ హీరోలకు ఇలాగే తీసుకుని ఏకంగా ఏఐ లోనే సినిమా తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు సీనియర్లకు ఇలాంటి సౌలభ్యాలు లేవు. చిరంజీవి నిజంగానే రైల్వే బ్రిడ్జి మీద వేలాడాల్సి వచ్చింది. బాలకృష్ణ కురూపి వేషంలో ముప్పై సంవత్సరాల క్రితం క్లిష్టమైన ప్రోస్తెటిక్స్ మేకప్ వేసుకున్నారు. కమల్ హాసన్, విక్రమ్ సంగతి సరేసరి. ఇప్పటి హీరోలకు అంత సవాళ్లు, ఛాలెంజులు లేవన్నది బాలయ్య ఉద్దేశం. టెక్నాలజి చేస్తున్న ముప్పుని బాగానే పసిగట్టారు.

This post was last modified on November 22, 2025 6:12 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Balakrishna

Recent Posts

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

3 minutes ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

6 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

7 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

8 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

9 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

10 hours ago