Movie News

అబ్బాయి ఏమో అలా… బాలయ్య ఏమో ఇలా!

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం.. ఆదిత్య 369. 90వ దశకం ఆరంభంలో ఎంతో అడ్వాన్స్డ్‌గా ఆలోచించి ఈ సినిమాను అద్భుత రీతిలో తెరకెక్కించారు సింగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని బాలయ్య ఎప్పట్నుంచో ఆశపడుతున్నాడు. సింగీతం దర్శకత్వంలోనే కొన్నేళ్ల ముందు ‘ఆదిత్య 999’ పేరుతో ఆ సినిమా చేయడానికి సన్నాహాలు జరిగాయి. 

కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. అలా అని దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అనుకోవడానికి వీల్లేదు. బాలయ్య ఎప్పటికప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. తాజాగా ఆయన మరోసారి ‘ఆదిత్య 369’ సీక్వెల్ గురించి ప్రస్తావించాడు. తన కొత్త చిత్రం ‘అఖండ-2’ ప్రమోషన్లలో భాగంగా ఒక నేషనల్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఆయన ఒక ఆసక్తికర ప్రకటన చేశారు.

‘ఆదిత్య 999 ప్రో మ్యాక్స్’ పేరుతో ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయనున్నట్లు బాలయ్య వెల్లడించారు. అంతే కాక అందులో తన కొడుకు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని ఆయన స్పష్టం చేశారు. తన కొడుకుతో కలిసి ఆదిత్య 369 సీక్వెల్ చేస్తానని బాలయ్య గతంలోనూ ప్రకటించాడు. మోక్షజ్ఞకు ఇదే డెబ్యూ మూవీ అని కూడా గతంలో వార్తలు వచ్చాయి. కానీ రకరకాల కారణాలతో మోక్షజ్ఞ అరంగేట్రం ఆలస్యం అవుతూ వస్తోంది. 

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా అనుకోకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన తొలి చిత్రం ఏదవుతుందో.. అసలు అతనిప్పుడిప్పుడే అరంగేట్రం చేస్తాడా లేదా అన్న అయోమయం నెలకొంది. ఒకవేళ డెబ్యూ కి రెడీ అయితే మాత్రం మంచి లవ్ స్టోరీతోనే చేస్తా అని మోక్షు అనుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో బాలయ్య తన కొడుకుతో కలిసి ‘ఆదిత్య 999’ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి త్వరలో ఆ వార్త నిజం అవుతుందేమో చూడాలి. సింగీతం చాలా ఏళ్ల కిందటే స్క్రిప్టు రెడీ చేసి స్టోరీ బోర్డ్ కూడా పూర్తి చేశారు. ఐతే ఇప్పుడాయనకు వయసు మీదపడ్డ నేపథ్యంలో ఈ సినిమాను బాలయ్యే స్వయంగా డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నాడు.

This post was last modified on November 22, 2025 1:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

17 seconds ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

6 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

7 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

8 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

9 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

10 hours ago