Movie News

హాలీవుడ్ మెగా బేనర్ సంచలన నిర్ణయం

మన దగ్గర ఇంకో నెల రోజుల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తాయన్న ఆశతో సంక్రాంతికి అడరజను దాకా సినిమాలు రిలీజ్ చేయడానికి కర్చీఫ్‌లు వేసుకుని కూర్చుని ఉన్నారు నిర్మాతలు. ఇందులో చాలా వరకు సినిమాలు ఎప్పుడో పూర్తయినవి. థియేటర్లు తెరుచుకున్నాకే సినిమాలను రిలీజ్ చేస్తామని వాటి నిర్మాతలు భీష్మించుకుని కూర్చున్నారు. ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా తిరస్కరిస్తూనే వచ్చారు. కొత్త ఏడాదిలో పరిస్థితులంతా మారిపోతాయని.. ఓటీటీల హవాకు తెరపడుతుందని, థియేటర్లు మళ్లీ కళకళలాడుతాయని వాళ్లు ఆశిస్తున్నారు.

ఐతే కొత్త ఏడాదిలో కూడా కరోనా ప్రభావం కొనసాగుతుందని.. వచ్చే ఏడాది కూడా థియేటర్లకు కష్టాలు తప్పవని సంకేతాలు అందుతున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

తమ సంస్థలో ఇప్పటికే పూర్తయిన, త్వరలో పూర్తి కానున్న సినిమాలన్నీ కలిపి 15 దాకా కొత్త ఏడాదిలో విడుదల కావల్సి ఉండగా.. వాటిని ఇటు థియేటర్లలో, అటు ఓటీటీల్లో ఒకేసారి విడుదల చేయాలని వార్నర్ బ్రదర్స్ నిర్ణయించుకుంది. ఈ సంస్థలో డ్యూన్, ది సుసైడ్ స్క్వాడ్, టామ్ అండ్ జెర్రీ, ది కంజూరింగ్: ది డెవిల్ మేక్ మి డు ఇట్, కింగ్ రిచర్డ్, జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయా లాంటి భారీ చిత్రాలు ఈ సంస్థలో ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. వీటిని కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తే ఆశించిన రెవెన్యూ రాదని అర్థం చేసుకుంది వార్నర్ బ్రదర్స్. ఇవన్నీ కూడా 2021లో విడుదల కావాల్సిన సినిమాలే.

ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల పరిస్థితి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. అన్ని చోట్లా పూర్తి స్థాయిలో థియేటర్లు నడవడానికి ఇంకో ఏడాది సమయం పట్టేలా ఉంది. ఈ ఏడాది ‘టెనెట్’ లాంటి భారీ చిత్రాన్ని ధైర్యం చేసి రిలీజ్ చేస్తే అంచనాల్లో సగం ఆదాయం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీతో వార్నర్ బ్రదర్స్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఒకేసారి అందుబాటులో ఉన్న థియేటర్లలో, అలాగే హెచ్‌బీవోలో వార్నర్ బ్రదర్స్ సినిమాలు రిలీజవుతాయి.

This post was last modified on December 4, 2020 2:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

3 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

4 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

4 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

5 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

5 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

6 hours ago