ఒక మూవీ కాన్సెప్ట్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సినిమాలో లేని సన్నివేశాలతో ప్రోమోలు తయారు చేయడం మామూలే. పోస్టర్లను కూడా ఇలాగే డిజైన్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఇవి ప్రేక్షకుల్లో తప్పుడు అంచనాలకు దారి తీస్తుంటాయి. ప్రోమోలను చూసి ఏదో ఊహించుకుని థియేటర్లకు వెళ్లి.. సినిమాలో ఆ సన్నివేశాలు లేవని నిరాశ చెందడం జరుగుతుంటుంది.
తాను డైరెక్ట్ చేసిన అవును సినిమా విషయంలో ఒక ప్రేక్షకుడు ఇలాగే బాగా డిజప్పాయింట్ అయి తనకు ఫోన్ చేసి చెడామడా తిట్టినట్లు రవిబాబు తెలిపాడు. ఆ సినిమానే.. అవును. రవిబాబు కెరీర్లో పెద్ద హిట్టయిన చిత్రాల్లో ఇదొకటి. ఈ హార్రర్ మూవీ అప్పట్లో మంచి విజయం సాధించింది. తన సినిమాల పోస్టర్ల విషయంలో రవిబాబు క్రియేటివ్గా ఆలోచిస్తాడన్న సంగతి తెలిసిందే.
సినిమాలో కథానాయికకు దయ్యం రూపంలో పెద్ద సమస్య తలెత్తుతుంది. ఆ సమస్యను పోస్టర్లలో మెటాఫర్ రూపంలో చూపించేందుకు ఆయన ఏనుగు రెఫరెన్స్ తీసుకున్నాడు. ఏనుగు ఒక అమ్మాయిని నలిపేస్తున్నట్లుగా చూపించాడు. ఐతే రాజమండ్రికి చెందిన ఒక వ్యక్తి.. ఇది ఏనుగుల మీద తీసిన సినిమా అనుకుని తన పిల్లల్ని తీసుకుని థియేటర్కు వెళ్లాడట. కానీ సినిమాలో ఏనుగు లేకపోయేసరికి రవిబాబు నంబర్ కనుక్కుని మరీ ఫోన్ చేసి తిట్టాడట. ఇదేం సినిమా అయ్యా.. పోస్టర్లలో ఏనుగులున్నాయి, సినిమాలో లేవేంటి.. ఏదో పిచ్చి సినిమా తీశావు అంటూ రవిబాబు మీద విరుచుకుపడ్డాడట.
తాను అదొక మెటాఫర్ అని వివరించి చెప్పే ప్రయత్నం చేసినా కూడా అతను అర్థం చేసుకోలేదని.. చాల్లే ఊరుకోవయ్యా అంటూ కసురుకుని ఫోన్ పెట్టేశాడని రవిబాబు తెలిపాడు. పూర్ణ లీడ్ రోల్ చేసిన అవునులో దయ్యం పాత్ర చేసింది రవిబాబే. సురేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా హిట్ కాగా.. దీనికి కొనసాగింపుగా అవును02 తీస్తే అది ఆడలేదు. చాన్నాళ్లుగా సినిమాలు చేయని రవిబాబు.. ఈటీవీ విన్ కోసం ఏనుగు తొండం ఘటికాచలం అనే కామెడీ మూవీ తీశాడు.
This post was last modified on November 19, 2025 9:20 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…