గత నెలాఖరున విడుదలైన మాస్ జాతర యూనానిమస్ ఫెయిల్యూర్ అనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. మరీ రొటీన్ కంటెంట్ తో దర్శకుడు భాను భోగవరపు తనకు దక్కిన తొలి అవకాశాన్ని వృథా చేసుకున్నాడనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ధమాకా స్థాయిలో రవితేజ, శ్రీలీల కాంబో మేజిక్ చేస్తుందనుకుంటే అదీ జరగలేదు. పోనీ భీమ్స్ సిసిరోలియో పాటలైనా కొంత రిలీఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది కానీ అదీ జరగలేదు. రవితేజ ఫలితం తెలిసిన వెంటనే దాని గురించి మాట్లాడ్డం లేదు. నిర్మాత నాగవంశీ తొలి రెండు మూడు రోజులు కాసిన్ని ట్వీట్లు వేసి తర్వాత వదిలేశారు. ఇదీ మాస్ జాతర గడిచిన స్టోరీ.
ఇప్పుడు వర్తమానానికి వద్దాం. మాస్ జాతర థియేటర్ రన్ అయిపోలేదు. ఇంకా మెయిన్ సెంటర్స్ లో కొనసాగుతూనే ఉంది. మొన్న ఆదివారం వీకెండ్ చాలా చోట్ల కాస్త నెంబర్లు కనిపించాయి. ది గర్ల్ ఫ్రెండ్ తో సమానంగా అనిపించే వసూళ్లు కొన్ని మాస్ సెంటర్స్ లో నమోదయ్యాయి. అంటే మాస్ ఆడియన్స్ కు ఇది తప్ప మార్కెట్ లో వేరే ఆప్షన్ లేదు. రొటీన్ గా ఉన్నా సరే ఎంటర్ టైన్మెంట్, ఫైట్స్, పాటలు ఉంటే చాలనుకునే వాళ్లకు థియేటర్లలో ఏ సినిమా లేదు. కాంత లాంటివి సెలెక్టెడ్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకోవడంతో మాస్ వర్గం లోటుగా ఫీలవుతోంది. అందుకే మాస్ జాతరకు ఓటేశారు.
ఎవరు ఔనన్నా కాదన్నా థియేటర్లకు మహారాజ పోషకులు మాస్ జనాలే. సోషల్ మీడియాతో సంబంధం లేకుండా, టాక్స్ రివ్యూస్ ఎక్కువగా పట్టించుకోకుండా పోస్టర్లు క్యాస్టింగ్ చూసి ఒక్కసారైనా చూసే బాపతు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉన్నారు. లేదంటే ఈపాటికి మాస్ జాతర అన్ని చోట్ల తీసేసి ఉండాలి. త్వరలో ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ కాబోతున్న మాస్ జాతరకు డేట్ ఇంకా డిసైడ్ కాలేదట. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు వారాలు అంటే నవంబర్ చివర్లో వచ్చే అవకాశముంది. నెట్ ఫ్లిక్స్ హక్కులు కొనుగోలు చేసింది. ముందే రిలీజ్ చేసే ప్రతిపాదన ఉందట కానీ ఇంకా ఫైనల్ కాలేదు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…