Movie News

కృష్ణ కోసం చేశారు… మరి మహేష్ కోసం?

సుమారు నలభై సంవత్సరాల క్రితం సింహాసనం విడుదలైనప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమైన థియేటర్లు రీ మాడలింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ మొదటిసారి టాలీవుడ్ లో 70 ఎంఎం స్టీరియో ఫోనిక్ సౌండ్ తో తొలి సినిమా తీశారు కాబట్టి, దానికి అనుగుణంగా ఉండేందుకు బోలెడు ఖర్చు అయినా సరే ఎగ్జిబిటర్లు రిస్క్ తీసుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ సింహాసనం బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత కృష్ణ చూపించిన దారిలో ఇతర నిర్మాతలు వెళ్లి అదే టెక్నాలజీతో తీయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి కారణం మహేష్ బాబు వారణాసి.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ టాపిక్ మీద డిస్కషన్ జరుగుతోంది. రాజమౌళి ఈ ప్యాన్ ఇండియా మూవీని కంప్లీట్ ఐమ్యాక్స్ లో తీస్తున్నామని ప్రకటించగానే ఒక్కసారిగా మూవీ లవర్స్ హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. అయితే ఇక్కడో సాడ్ న్యూస్ ఉంది. ఇండియాలో పరిమిత సంఖ్యలో ఐమాక్స్ తెరలు ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ఒక్కటి కూడా లేదు. కోకా పేటలో అల్లు ఫ్యామిలీ నిర్మిస్తున్న మల్టీప్లెక్సులో రావొచ్చని అంటున్నారు కానీ నిర్ధారణగా తెలియదు. క్రాస్ రోడ్స్ లో రావొచ్చనే ప్రచారం జరిగినా అందులో నిజం లేదని తర్వాత క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చేతిలో సుమారు రెండేళ్ల సమయముంది.

ఈలోగా వారణాసి కోసం ఏవైనా థియేటర్లు, మల్టీప్లెక్సులు ఐమాక్స్ గా మారతాయా అంటే వెంటనే సమాధానం దొరకడం లేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే ప్లానింగ్ ఇప్పటి నుంచే ఉండాలి. అప్పట్లో కృష్ణ సినిమా కోసం ఇలాంటి విప్లవాత్మక మార్పు వచ్చినప్పుడు, మహేష్ మూవీ కోసం కూడా రావాలనేది ఘట్టమనేని ఫ్యాన్స్ కోరిక. ఎంతమేరకు నెరవేరుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి. ప్రధాన నగరాల్లో కాకపోయినా కనీసం హైదరాబాద్ లో రెండు మూడు ఐమాక్స్ లు ఉండాలని సినీ ప్రియులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళ ఆకాంక్ష ఏ మేరకు నెరవేరుతుందో ఇంకొంత కాలం ఆగి చూడాలి.

This post was last modified on November 17, 2025 12:22 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

42 minutes ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

9 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

10 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

10 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

10 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

13 hours ago