వారణాసి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జరిగిన పొరపాట్లు, తప్పులు మహేష్ అభిమానులను అసంతృప్తికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ కాసేపు మొరాయించడం, రాజమౌళి అసహనానికి గురి కావడం, యాంకర్ సుమ టైంని మేనేజ్ చేయలేక కిందామీదా పడుతూ, ఏదేదో చేస్తూ ఆఖరికి రమా రాజమౌళి చేత ఇన్ డైరెక్ట్ గా తిట్లు తినడం ఇలా ఏవేవో జరిగిపోయాయి. దీని కన్నా ముందు టైటిల్ షాట్ ఉన్న మహేష్ బాబు లుక్కు ట్విట్టర్ లో లీకైపోవడం అన్నింటి కన్నా పెద్ద డ్యామేజ్. ఇదేదో ఫేక్ అనుకున్నారు కానీ తీరా చూస్తే అది నిజమైన వీడియో అని ఒరిజినల్ చూశాక అర్థమైపోయింది.
అసలు రెండు మూడు రోజుల నుంచి యాంకర్లను తీసుకొచ్చి వర్క్ షాప్ చేసిన రాజమౌళి దాన్నుంచి పెద్దగా ప్రయోజనం పొందలేదు. బోలెడు డబ్బు పోసి ముంబై నుంచి పట్టొచ్చిన ఆశిష్ చంచలాని ఎలాంటి మేజిక్ చేయలేకపోయాడు. తెలుగు రాకపోయినా హిందీ ఇంగ్లీష్ తో మేనేజ్ చేద్దామని చూసినా పనవ్వలేదు. ఒకదశ దాటాక సుమనే మొత్తం టేకోవర్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ స్క్రిప్ట్ ఓల్డ్ స్టైల్ లో సాగింది. రెగ్యులర్ ఈవెంట్స్ లో చూసే జోకులు, గెస్టులను అడిగే ప్రశ్నలు రొటీన్ గా ఉన్నాయి. మహేష్ బాబుని డమ్మీ నందిపై కూర్చోబెట్టి స్టేజి మీదకు తెచ్చిన విధానం కూడా సూపర్ ఎగ్జైటింగ్ గా లేదు. ఇవన్నీ ఫ్యాన్స్ చర్చలో ఉన్నాయి.
వీటిని ఇకపై జాగ్రత్తలు తీసుకోవడానికి కావాల్సిన హెచ్చరికలుగానే పరిగణించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లైవ్ లో చూస్తున్న వాళ్లకు ఓటిటి యాప్ లో వచ్చిన యాడ్స్ చిరాకు పుట్టించేశాయి. స్టేజి మీద కూడా స్పాన్సర్స్ ఉత్పత్తులను ప్లే చేయడం చాలా మందికి నచ్చలేదు. కోట్ల ఖర్చుతో ఈవెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ సహకారం అవసరమే కానీ మరీ ఇంతగా ఎక్స్ ప్లోర్ చేయాల్సిన అవసరం ఏముందనేది వాళ్ళ వెర్షన్. ముందు రోజు రాత్రి డ్రోన్ రావడం లాంటి సంఘటనలు సీరియస్ గా తీసుకుని ఇకపై జరగకుండా చూడాలి. ఏది ఏమైనా బ్లాక్ బస్టర్ అవుతుందన్న ఈవెంట్ కాస్తా జస్ట్ హిట్ దగ్గరే ఆగిపోయింది.
This post was last modified on November 16, 2025 1:17 pm
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…