తెలుగు ప్రేక్షకులకు రాముడు అంటే గుర్తొచ్చే రూపం స్వర్గీయ నందమూరి తారకరామారావుగారే. కృష్ణుడి పాత్రల ద్వారానే ఎక్కువ పాపులారిటీ వచ్చినప్పటికీ లవకుశలో ఆయన దివ్యమంగళ దర్శనం జరిగాక వేరొకరిని ఆ క్యారెక్టర్ లో చూసేందుకు జనం ఇష్టపడేవాళ్లు కాదు. అందుకే సంవత్సరాల తరబడి ఎవరు ఆ రిస్క్ చేయలేకపోయారు. అక్కినేని నాగేశ్వరరావుగారిని అడిగినా ఒప్పుకోలేదు. అంతగా ఎన్టీఆర్ ప్రభావం ఆడియన్స్ మీద ఉండేది. తర్వాత సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబుని రాముడిగా అద్భుతంగా చూపించిన దర్శకులు బాపు ప్రేక్షకులను ఒప్పించడంలో విజయం సాధించారు. అంత క్లిష్టమైన బాధ్యత ఇది.
ఇప్పుడు ఇన్ని దశాబ్దాల తర్వాత రాముడిగా మహేష్ బాబుని చూపించబోతున్నారు రాజమౌళి. ఒక కీలకమైన్ ఎపిసోడ్ కోసం ఫోటో షూట్ చేశాక వాల్ పేపర్ గా తన ఫోటోనే పెట్టుకున్నానని చెప్పిన జక్కన్న మళ్ళీ ఎవరైనా చూస్తారేమోనని డిలీట్ చేశానని చెప్పుకొచ్చారు. తనకే గూస్ బంప్స్ వచ్చే స్థాయిలో మహేష్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని ఆనందం వ్యక్తం చేశారు. కొంటె కృష్ణుడిగా కనిపించే మహేష్ సౌమ్యుడైన రాముడిగా సూటవుతాడా అనే అనుమానం పూర్తిగా తొలగిపోయిందని, ఈ ఎపిసోడ్ రాస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు గాల్లో తేలిన ఫీలింగ్ కలుగుతోందని ఊహించని పెద్ద స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారు.
రాజమౌళి మాటల ప్రకారం మహేష్ బాబు విశ్వరూపం చూపించేది బహుశా రాముడి అవతారంలోనే కావొచ్చు. ఇక్కడ విజయేంద్రప్రసాద్ అన్న మాటలను లింక్ చేసుకుంటే మ్యాటర్ అర్థమైపోతుంది. రాముడిగా ఆదిపురుష్ లో ప్రభాస్ కూడా చేశాడు కానీ సినిమాతో పాటు డార్లింగ్ లుక్స్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. ఓం రౌత్ సరిగా వాడుకుని ఉంటే నెగటివ్ కామెంట్స్ వచ్చేవి కాదు కానీ ఛాన్స్ మిస్ చేశాడు. కానీ ఇప్పుడు మహేష్ ని హ్యాండిల్ చేస్తోంది రాజమౌళి. సో అంచనాలు ఎంత పెట్టుకున్నా దానికి మించిన అవుట్ ఫుట్ ఇస్తాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఎక్కువ వెయిట్ చేయాలి.
This post was last modified on November 15, 2025 10:33 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…