యావత్ టాలీవుడ్ ప్రేక్షకులే కాదు సినీ లోకం మొత్తం ఇవాళ గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ మీద దృష్టి పెట్టింది. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వేడుకలో వేలాది అభిమానులు పోటెత్తగా ఆన్ లైన్ జియో హాట్ స్టార్ ద్వారా చూస్తున్న ఆడియన్స్ కోట్లలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇంత ఎగ్జైట్ మెంట్ చూపించిన ఓపెన్ ఈవెంట్ ఏదీ లేదని చెప్పాలి. నిర్వాహకులు పోలీసుల సహాయంతో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఫంక్షన్ చాలా స్మూత్ గా జరిగిపోయింది. ఈ సందర్భంగా రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక ముఖ్యమైన ఎపిసోడ్ గురించి షేర్ చేసుకున్నారు.
ఈ మూవీలో ఒక అరగంట యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఎలాంటి సిజి, విజువల్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ లేకుండా చూస్తేనే మహేష్ బాబు విశ్వరూపం కనిపించింది. ఏదైనా తిరుపతి లాంటి గుడికి వెళ్ళినప్పుడు ఎలాంటి భావన కలుగుతుందో ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ అలానే అనిపించాయని ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఇంతకీ ఈ ముప్పై నిమిషాల ట్రాక్ ఏంటి, ఏ సందర్భంలో వస్తుందనేది మాత్రం చెప్పలేదు. ఎంతైనా ఫాదరాఫ్ జక్కన్న కదా. ఎలా బయటపడతారు. ఇది విన్న ఫ్యాన్స్ కేకలు ప్రాంగణం మొత్తం హోరెత్తాయి. ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్స్ విజయేంద్ర ప్రసాద్ పంచుకోలేదు.
వారణాసినే టైటిల్ గా కన్ఫర్మ్ అయ్యిందని చెప్పబడుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన మొదటి ప్రమోషనల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అంచనాలకు తగ్గట్టే జన సందోహం రావడం, ఎక్కడా ఎలాంటి అపశ్రుతి కలగకపోవడం సంతోషాన్ని కలిగించాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్ ఫిలిం మేకర్స్ సైతం దీని పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. విడుదల తేదీ ఇంకా దూరంలో ఉంది కానీ ఉద్వేగం మాత్రం అందరికి ఆణువణువులో ఉంది. మొదటి అడుగుని దిగ్విజయంగా పూర్తి చేసిన రాజమౌళి టీమ్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏది కానుందో చూడాలి.
This post was last modified on November 15, 2025 8:59 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…