ప్రభాస్ అదేపనిగా కొత్త సినిమాలు అనౌన్స్ చేయడం ఫాన్స్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తోంది. రాధే శ్యామ్ పూర్తి చేయకుండా వేరే సినిమాలు అనౌన్స్ చేయడం, ఫలానా సమయానికి షూటింగ్ మొదలవుతుందని చెప్పడం ఫాన్స్కి కూడా అర్థం కావడం లేదు. అయితే ప్రభాస్ ఇదంతా తన సొంత సంస్థ లాంటి యువి క్రియేషన్స్ కోసం చేస్తున్నాడని, ఆర్థికంగా ఆ సంస్థ ఇబ్బందుల్లో వుండడంతో రాధేశ్యామ్ను ముందుకు నడిపించడానికి ప్రభాస్ ఇలా మల్టిపుల్ ప్రాజెక్టులు ఓకే చేసి అడ్వాన్సులు తీసుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాధే శ్యామ్ చిత్రానికి బిజినెస్ నిలిచిపోవడంతో దానికి కావాల్సిన వనరుల కోసం ప్రభాస్ ఇలా ఇతర ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఫండ్స్తో హెల్ప్ చేస్తున్నాడని, అలాగే ఆ సంస్థ మరికొన్ని చిన్న సినిమాలు తీయడానికి చేయూత ఇస్తున్నాడని, ఒక విధంగా ఆ సంస్థలో ప్రభాస్ పెట్టుబడి పెడుతున్నట్టేనని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు.
యువి సంస్థ నిజంగా అంతలేసి ఆర్థిక ఇబ్బందులలో వుందా లేదా అనేది తెలియదు కానీ ఈ గాసిప్స్ అయితే లాజికల్గానే వున్నాయి. ఆల్రెడీ షూటింగ్ మొదలైన సినిమాను పూర్తి చేసే పని మానేసి ప్రభాస్ ఇలా సడన్గా ఇన్ని సినిమాలు అనౌన్స్ చేయడం వెనుక ఇంతకంటే లాజిక్ అయితే లేదు మరి.
This post was last modified on December 3, 2020 3:16 am
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…