బిగ్బాస్ షోలో క్రియేటివ్ టీమ్ ఒకరిద్దరు ఆటగాళ్లకు అనుకూలంగా వుంటుందనేది మొదటి సీజన్నుంచీ తెలిసిన విషయమే. పబ్లిక్ ఎవరి వైపు అయితే నిలబడతారో వారిని ఇరుకున పెట్టి, మరింతగా ఓట్లు పడేలా చేస్తుంటారు. అయితే ప్రతి సీజన్లో బిగ్బాస్ ఎవరికి ఫేవర్ అనేది తెలిసిపోయేది.
ఈసారి కంటెస్టెంట్లలో ఎవరూ కూడా అంత ప్రభావితం చేయగల క్యాండిడేట్లు లేకపోవడంతో బిగ్బాస్ టీమ్ ఎవరికి సహకరిస్తోందనేది అర్థం కావడం లేదు. అమ్మ రాజశేఖర్, మెహబూబ్, మోనల్ లాంటి వాళ్లను షోలో ఎక్కువ కాలం వుంచడానికి ప్రయత్నాలు జరిగినా కానీ అవి కేవలం ఆట పరంగా ఆసక్తి రేకెత్తించడానికి చేసిన ప్రయత్నాలే తప్ప మరొకటి కాదు.
చివరి మూడు వారాలకు చేరిపోయిన ఈ తరుణంలో బిగ్బాస్ అందరికీ స్క్రీన్ టైమ్ కేటాయించడం ఆసక్తికరమయింది. అభిజీత్, హారికను టార్గెట్ చేస్తూనే వారికి తగిన స్క్రీన్ టైమ్ ఇస్తున్నారు. అలాగే అరియానా, అవినాష్కి కూడా చాలా సమయం పాటు సింపతీ గేమ్ నడిపే అవకాశాన్నిస్తున్నారు. అఖిల్, సోహైల్ల కండబలం వల్ల మిగతా వాళ్లు నిలబడలేకపోతున్నారనే సంగతి కూడా రిజిష్టర్ చేస్తున్నారు.
ఇటు, అటు అని లేకుండా అన్ని వైపులా ఆడేస్తున్న బిగ్బాస్ టీమ్ టాప్ 5లో ఎవరిని వుంచాలనుకుంటున్నారు, అభిజీత్ని ఓడించే ఉద్దేశం వుంటే అందుకు తగినవాడు ఎవరని డిసైడ్ చేసారు? చూస్తోంటే బిగ్బాస్ టీమ్ టీఆర్పీ గేమ్ ఆడుతూ అందరు కంటెస్టెంట్ల అభిమానులనూ షోకి అంటిపెట్టుకుని వుండేలా జాగ్రత్త పడుతున్నటున్నారు.
This post was last modified on December 3, 2020 3:13 am
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…