మామూలుగా తన కొత్త సినిమాను మొదలుపెట్టే ముందే దాని విశేషాలను అధికారికంగా మీడియాతో, అభిమానులతో పంచుకోవడం రాజమౌళికి అలవాటు. సినిమా ప్రారంభోత్సవం రోజే ‘ఈగ’ కథ చెప్పడం.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ ఆరంభ దశలో ఉండగానే ఆ సినిమా కాన్సెప్ట్ గురించి ఓపెన్ చేసేయడం రాజమౌళికే చెల్లింది. కానీ మహేష్ బాబుతో కొత్త సినిమా విషయంలో మాత్రం ఆయన ఎక్కడ లేని గోప్యత పాటించారు. చిత్రీకరణ మొదలైనట్లు అధికారికంగా ప్రకటించలేదు. కొన్ని నెలల తర్వాత కూడా ఏ అప్డేట్ ఇవ్వలేదు.
మహేష్ పుట్టిన రోజుకు కూడా ఏ చిన్న విశేషాన్నీ పంచుకోలేదు. నవంబరులో ట్రీట్ ఉంటుందని మాత్రమే చెప్పాడు జక్కన్న. ఐతే ఈ నెలలో జస్ట్ టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే లాంచ్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ చడీచప్పుడు లేకుండా వరుస అప్డేట్లతో షాకిస్తోంది రాజమౌళి టీం. ఇప్పటికే విలన్ పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ వదిలారు. దానికే ఆశ్చర్యపోతుంటే.. ‘సంచారీ..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేయడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి.
ఒక పెద్ద సినిమా నుంచి పాటను లాంచ్ చేయడమంటే ఈ రోజుల్లో పెద్ద ప్రహసనంగా మారుతోంది. ముందు రేపు ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాం అంటారు. తర్వాత పాట గ్లింప్స్ ఏ రోజు రిలీజ్ చేయబోతున్నామో చెప్తారు. ఆ గ్లింప్స్లో పూర్తి పాట ఉండదు. ఒక అరనిమిషం పాట చూపించి.. ఫుల్ సాంగ్ ఫలానా రోజు అని మళ్లీ ఒక టైమింగ్ ఇస్తారు. ఇలా అప్గేట్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియా జనాలను తీవ్ర అసహనానికి గురి చేయడం ఈ మధ్య రివాజుగా మారింది. రాను రాను ఈ వ్యవహారం అభిమానుల్లో ఫ్రస్టేషన్ను పెంచేస్తోంది.
కానీ మహేష్-రాజమౌళి సినిమా టీం మాత్రం.. ఎవ్వరూ ఊహించని విధంగా చిన్న హింట్ కూడా ఇవ్వకుండా నేరుగా పాటను లాంచ్ చేయడం అందరికీ పెద్ద షాకే. పైగా ఈ పాటను శ్రుతి హాసన్ ఆలపించడం ఇంకా పెద్ద సర్ప్రైజ్. సినిమా థీమ్ను చాటిచెప్పేలా సాగిన ఈ పాట బాగానే ఆకట్టుకుంటోంది. ఇంత పెద్ద సినిమా నుంచి, హడావుడి లేకుండా.. ఈ దశలో ఇలా ఫుల్ సాంగ్ రిలీజ్ చేయడం విశేషమే. ఒక పాట గురించి వారాలు, నెలల తరబడి ఊరించి.. అప్డేట్లకు అప్డేట్లు ఇస్తూ ఫ్రస్టేట్ చేయడం మాని.. రాజమౌళి లాగే నేరుగా పాటలు రిలీజ్ చేసే సంస్కృతి రావాలనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.
This post was last modified on November 11, 2025 6:27 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…