సోషల్ మీడియాని చికిరి చికిరి పాట ఊపేస్తోంది. ఇన్స్ టా రీల్స్ వెల్లువలా వచ్చి పడుతుండగా ట్వీట్ల గురించి చెప్పుకుంటూ పోతే పుస్తకమే అవుతుంది. పేరుకి లిరికలే అయినా దాదాపు వీడియో సాంగ్ మొత్తాన్ని రిలీజ్ చేయడం వెనుక దర్శకుడు బుచ్చిబాబు ఆలోచన ఎంత దూరదృష్టితో ఉందో అభిమానులకు అర్థమైపోయింది. రామ్ చరణ్ గ్రేస్ మొత్తాన్ని పిండేశారా అనే రేంజ్ లో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు చిన్నా పెద్ద తేడా లేకుండా తెగ కనెక్ట్ అయిపోతున్నాయి. ఏఐ, విఎఫ్ఎక్స్, గ్రీన్ మ్యాట్ లేకుండా రియల్ లొకేషన్లలో చిత్రీకరించిన బుచ్చిబాబు కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తోంది.
ఇక ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏఆర్ రెహమాన్ గురించి. కొంత కాలంగా ఆయన ఫామ్ లో లేరు. పొన్నియిన్ సెల్వన్ లాంటి వాటికి మంచి మ్యూజిక్ ఇచ్చినా ఒకప్పటి వింటేజ్ వైబ్ రాలేదన్నది ఫ్యాన్స్ సైతం ఒప్పుకుంటారు. అలాంటిది పెద్ది లాంటి రా విలేజ్ డ్రామాకు ఎలాంటి పాటలు ఇస్తారనే అనుమానం రావడం సహజం. వాటిని పటాపంచలు చాలా క్యాచీ ట్యూన్ తో చికిరి చికిరి అంటూ రెహమాన్ చేసిన అల్లరి ఏకంగా పుష్ప కిసిక్ సాంగ్ రికార్డులను సైతం దాటేసి నెంబర్ వన్ స్థానం వైపు దూసుకుపోయేలా చేసింది. ఒక్క తెలుగు వెర్షనే రోజు గడవకుండానే 28 మిలియన్ల వ్యూస్ దాటడం మాములు విషయం కాదు.
తమిళ వర్షన్ ఆలస్యంగా ఈ రోజు విడుదల చేయడం వల్ల కౌంట్ కొంచెం తగ్గినప్పటికీ ఓవరాల్ గా అన్ని భాషలు కలిపి నలభై మిలియన్లకు పైగా వ్యూస్ రావడం మెగా ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. గేమ్ ఛేంజర్ లో ఏవైతే ట్రోలింగ్ కు గురయ్యాయో సరిగా వాటికి సమాధానం చెప్పేందుకు అనే రేంజ్ లో బుచ్చిబాబు చరణ్ ని చూపించిన విధానం చార్ట్ బస్టర్ ఇచ్చేసింది. నిన్నటి దాకా సౌండ్ చేసిన మన శంకరవరప్రసాద్ గారులోని మీసాల పిల్ల హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. చిరంజీవి స్టైల్ ని రామ్ చరణ్ గ్రేస్ టేకోవర్ చేసింది. ఏమైనా రెహమాన్, చరణ్, బుచ్చి ముగ్గురు కలిసి విధ్వంసం చేసేశారు.
This post was last modified on November 8, 2025 1:07 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…