చాలా ఏళ్లుగా తన స్థాయికి తగ్గ సక్సెస్ లేక ఇబ్బంది పడుతూ వచ్చాడు తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్. ఐతే ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఆయన కరవును తీర్చింది. ఇదేం గొప్ప సినిమా కాదు కానీ.. పవన్ కళ్యాణ్ మూవీ ‘ఓజీ’ లాగే నాన్ స్టాప్ ఎలివేషన్లు, ఫ్యాన్ మూమెంట్స్తో అజిత్ అభిమానులను అలరించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి మంచి ఫలితమే వచ్చింది.
ఈ సినిమాలో తనను ప్రెజెంట్ చేసిన తీరు.. తన అభిమానులను అలరించిన వైనం నచ్చి దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్కు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు అజిత్. అతను కూడా అజిత్కు వీరాభిమాని కావడం గమనార్హం. వీరి కలయికలో మరో భారీ చిత్రం తెరకెక్కబోతోంది. ఆ సినిమాలో కీలక పాత్రలకు ఆధిక్ ఎంచుకున్న కాస్టింగ్ అమితాసక్తిని రేకెత్తిస్తోంది.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో పాటు నటుడిగా, కొరియోగ్రాఫర్గా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో నటిస్తున్నాడట. సేతుపతి చేసే హీరో పాత్రల కంటే అతను నెగెటివ్, క్యారెక్టర్లు భలే కిక్కిస్తాయి. ఇంతకుముందు విజయ్ మూవీ ‘మాస్టర్’లో విలన్ పాత్రతో అతను అదరగొట్టాడు. ఇప్పుడు అజిత్ సినిమాలో అతను నటిస్తున్నాడనగానే క్యూరియాసిటీ పెరుగుతోంది.
అదే సమయంలో లారెన్స్ ఇందులో నటించనున్నాడన్న వార్త కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. అతనిలా వేరే హీరోల చిత్రాల్లో నటించడం అరుదు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ‘కాంచన-4’ నటిస్తున్న లారెన్స్.. అజిత్తో నటించడానికి ఒప్పుకోవడం ఇంట్రెస్టింగే. ఈ కాస్టింగ్తో సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తున్నాడు ఆధిక్. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
This post was last modified on November 7, 2025 3:25 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…