ఈ శుక్రవారం తెలుగులో మూడు సినిమాలు బాక్సాఫీస్ పోరుకు రెడీ అయ్యాయి. అందులో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం.. రష్మిక మందన్నా లీడ్ రోల్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా గురించి విడుదలకు ముందే ఇండస్ట్రీలో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు మంచి సినిమాలే చేస్తున్నా కోరుకున్న విజయం దక్కని సుధీర్ బాబు.. ఈసారి ట్రెండుకు తగ్గట్లుగా డివైన్ టచ్ ఉన్న హార్రర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ చిత్రమే.. జటాధర. తిరువీర్ హీరోగా నటించిన ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ కూడా పెయిడ్ ప్రివ్యూలతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఐతే ప్రస్తుతానికి ప్రధాన పోటీ రష్మిక, సుధీర్ చిత్రాల మధ్య ఉంది. వీటికి తోడుగా తమిళ అనువాదం ‘ఆర్యన్’ కూడా రిలీజవుతోంది. విశేషం ఏంటంటే.. రేపు బాక్సాఫీస్ దగ్గర ఢీకొట్టబోతున్న హీరో సుధీర్ బాబు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. ఆ తర్వాత కలిసి పని చేయబోతున్నారు. సుధీర్ బాబు తన కొత్త చిత్రాన్ని రాహుల్ దర్శకత్వంలోనే చేయబోతున్నట్లు వెల్లడించాడు. ‘చి ల సౌ’తో అందరినీ ఆశ్చర్యపరిచి.. ‘మన్మథుడు-2’తో షాక్ తిన్న రాహుల్.. ‘ది గర్ల్ ఫ్రెండ్’తో బౌన్స్ బ్యాక్ అయ్యేలానే కనిపిస్తున్నాడు.
దీని తర్వాత అతను సుధీర్ బాబుతో ఒక సెన్సేషనల్ మూవీ చేయనున్నాడట. అలాంటి కథ ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా రాలేదని ఎలివేషన్ ఇస్తున్నాడు సుధీర్ బాబు. అదొక బాహుబలి తరహా సినిమా అని కూడా అతను చెప్పడం విశేషం. సుధీర్ అంతగా చెబుతుండడంతో ఏంటా కాన్సెప్ట్ అనే ఆసక్తి కలుగుతోంది. దీంతో పాటు ఎప్పట్నుంచో వాయిదా పడుతూ వస్తున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్లోనూ తాను నటించాల్సి ఉందని సుధీర్ తెలిపాడు. ‘భాగి’లో విలన్ రోల్ చేశాక హిందీ నుంచి చాలా ఛాన్సులు వచ్చినా తాను నటించలేదని.. ‘జటాధర’తో హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టకుంటాననే నమ్మకం ఉందని సుధీర్ బాబు తెలిపాడు.
This post was last modified on November 6, 2025 8:20 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…