సీక్వెల్స్ కి క్రేజ్ ఉంటుంది. మొదటి భాగాలు బ్లాక్ బస్టర్ అయినప్పుడే వీటిని తీస్తే అందం చందం. అంతే తప్ప ప్రతిదానికి పార్ట్ 2 తీయాలని పరుగులు పెట్టకూడదు. ఈ మధ్య అభిమానులు ఎవరైనా దర్శక నిర్మాతలను కలిసినప్పుడు ఫలానా సినిమాకు కొనసాగింపు ఎప్పుడు ఉంటుందని అడిగేస్తున్నారు. నిజాంగా వాటికి క్రేజ్ ఉందా లేదాని ఆలోచించడం లేదు. మిరాయ్ ప్రమోషన్లలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనిని ఈగల్ 2 గురించి ప్రశ్న ఎదురయ్యింది. ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయిన సంగతి మర్చిపోయి ఇప్పుడు ఇంకోటి తీయమనడం భావ్యం కాదు. ఇదే సిచువేషన్ సముతిరఖనికి తాజాగా జరిగిన కాంత ఈవెంట్ లో ఎదురయ్యింది.
పవన్ కళ్యాణ్ బ్రోకి కంటిన్యుయేషన్ ఎప్పుడు ఉంటుందని అడిగిన క్వశ్చన్ కు సమాధానంగా సముతిరఖని మాట్లాడుతూ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, పవర్ స్టార్ అంగీకారం వస్తే మొదలుపెట్టడమేనని సెలవిచ్చారు. వినడానికి బాగానే ఉంది కానీ బ్రో కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదన్నది ఓపెన్ సీక్రెట్. నిర్మాత విశ్వప్రసాదే ఒప్పుకున్న దాఖలాలు ఉన్నాయి. ఏదో పవన్ ఇమేజ్ పుణ్యమాని థియేటర్ రెవిన్యూ, నాన్ థియేట్రికల్ హక్కులతో ఓ మోస్తరుగా గట్టెక్కింది కానీ కంటెంట్ పరంగా ఆడియన్స్, ఫ్యాన్స్ ని అంతగా మెప్పించలేకపోయింది. అందుకే బ్రోని స్పెషల్ గా ఫీలయ్యే అభిమానులు తక్కువే.
అసలు బ్రో 2 బదులు సముతిరఖని ఏదైనా కొత్త కథతో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బ్రోలో ఆల్రెడీ సాయి దుర్గ తేజ్ క్యారెక్టర్ చనిపోయింది. ఇప్పుడు కొత్తగా వేరొకరిని తీసుకురావాలి. ఇలాంటి పాత్రలు పవన్ గతంలో గోపాల గోపాలలోనూ చేశాడు. పదే పదే దేవుడిగా చూపించడం సబబు కాదు. అయినా ఇంకా సురేందర్ రెడ్డితో చేయాల్సిన సినిమా పెండింగ్ లో ఉంది. ఓజికి సీక్వెల్, ప్రీక్వెల్ చేయాలని పవన్ కి చాలా ఉత్సాహంగా ఉంది. ఈ లెక్కన బ్రో 2 అనేది జరగని పని. అయితే ఒరిజినల్ వెర్షన్ వినోదయ సితం 2ని తెరకెక్కించే ఆలోచనైతే సముతిరఖనికి ఉంది. తమిళంలో ఇది సూపర్ హిట్ మూవీ మరి.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…