Movie News

మల్టీప్లెక్సులకు కండిషన్లు పెట్టిన నిర్మాతలు

కరోనా-ధాటికి సినీ పరిశ్రమ మామూలుగా దెబ్బ తినలేదు. నిర్మాతలు అన్ని రకాలుగా నష్టం చవిచూశారు. ఐతే అదే సమయంలో సినిమాను నమ్ముకున్న థియేటర్ల వ్యవస్థ మరింతగా దెబ్బ తింది. నిర్మాతలైనా ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేసో.. షూటింగ్‌ ఖర్చులు తగ్గించుకునో నష్టాలు కొంత మేర పూడ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ థియేటర్ల వ్యవస్థకు ఆ అవకాశం కూడా లేకపోయింది. ఎనిమిది నెలలుగా వాటిని నమ్ముకున్న వాళ్లకు పైసా ఆదాయం లేదు. ఎ

ట్టకేలకు తెలంగాణలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి రాగా.. డిసెంబరు 4 నుంచి వాటిని నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ల సంగతేమో కానీ.. మల్టీప్లెక్సులైతే ఆ రోజున మొదలైపోతున్నాయి. ఐతే ఉత్సాహంగా స్క్రీన్లు తెరవడానికి రెడీ అవుతున్న మల్టీప్లెక్సులకు టాలీవుడ్ నిర్మాతలు కొన్ని కండిషన్లతో స్వాగతం పలుకుతున్నారు.

మల్టీప్లెక్సుల్లో రెవెన్యూ షేరింగ్ విషయమై ఎప్పట్నుంచో వివాదం నడుస్తోంది. అవి నిర్మాతలను శాసిస్తున్నాయని.. ఆదాయంలో ఎక్కువ వాటా తీసుకుని తమను దెబ్బ తీస్తున్నాయని నిర్మాతలు అంటున్నారు. దీనికి తోడు థియేటర్లతో మరికొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఐతే ఇప్పుడు మల్టీప్లెక్సులు కొత్త కంటెంట్ కోసం తమ వైపు చూస్తున్న నేపథ్యంలో నిర్మాతలు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయంగా భావించారు.

ఈ నేపథ్యంలో రెవెన్యూ షేరింగ్ మార్చాలని వాళ్లు ఒక ప్రతిపాదన పెట్టారు. ఇప్పటిదాకా ఒక సినిమాకు తొలి వారంలో వచ్చే వసూళ్లలో నిర్మాతలకు 55 శాతం, మల్టీప్లెక్సులకు 45 శాతం ఆదాయం దక్కుతోంది. తర్వాతి మూడు వారాల్లో వరుసగా 45:55, 40:60, 35:65 నిష్పత్తిలో నిర్మాతలు, థియేటర్లకు ఆదాయం అందుతోంది.

ఐతే ఇకపై తొలి వారం ఆదాయంలో తమకు 60 శాతం వాటా ఇచ్చి మల్టీప్లెక్సులు 40 శాతం తీసుకోవాలని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ డిమాండ్. తర్వాతి రెండు వారాల్లో 50:50, 40:60 నిష్పత్తిలో వాటా పంచుకుందామని ప్రతిపాదన పెట్టారు. ఈ రెవెన్యూ షేరింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలని.. దీంతో పాటు తమ నుంచి వసూలు చేసే వర్చువల్ ప్రింట్ ఫీని రద్దు చేయాలని, థియేటర్లలో వేసే ట్రైలర్లకు డబ్బులు వసూలు చేయొద్దని, మల్టీప్లెక్సుల ఆవరణలో పెట్టే పోస్టర్లు, ఇతర మెటీరియల్స్‌కి డబ్బులు వసూలు చేయకూడదని, ప్రభుత్వం అధిక షోలకు అనుమతిస్తే మల్టీప్లెక్సులు పాటించాలని.. ఇలా కొన్ని డిమాండ్లు పెట్టారు. మరి వీటికి మల్టీప్లెక్సుల యాజమాన్యాలు ఎంతమేర అంగీకరిస్తాయో చూడాలి.

This post was last modified on December 1, 2020 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

47 minutes ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

1 hour ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

2 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

2 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

3 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

5 hours ago