కరోనా-ధాటికి సినీ పరిశ్రమ మామూలుగా దెబ్బ తినలేదు. నిర్మాతలు అన్ని రకాలుగా నష్టం చవిచూశారు. ఐతే అదే సమయంలో సినిమాను నమ్ముకున్న థియేటర్ల వ్యవస్థ మరింతగా దెబ్బ తింది. నిర్మాతలైనా ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేసో.. షూటింగ్ ఖర్చులు తగ్గించుకునో నష్టాలు కొంత మేర పూడ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ థియేటర్ల వ్యవస్థకు ఆ అవకాశం కూడా లేకపోయింది. ఎనిమిది నెలలుగా వాటిని నమ్ముకున్న వాళ్లకు పైసా ఆదాయం లేదు. ఎ
ట్టకేలకు తెలంగాణలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి రాగా.. డిసెంబరు 4 నుంచి వాటిని నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ల సంగతేమో కానీ.. మల్టీప్లెక్సులైతే ఆ రోజున మొదలైపోతున్నాయి. ఐతే ఉత్సాహంగా స్క్రీన్లు తెరవడానికి రెడీ అవుతున్న మల్టీప్లెక్సులకు టాలీవుడ్ నిర్మాతలు కొన్ని కండిషన్లతో స్వాగతం పలుకుతున్నారు.
మల్టీప్లెక్సుల్లో రెవెన్యూ షేరింగ్ విషయమై ఎప్పట్నుంచో వివాదం నడుస్తోంది. అవి నిర్మాతలను శాసిస్తున్నాయని.. ఆదాయంలో ఎక్కువ వాటా తీసుకుని తమను దెబ్బ తీస్తున్నాయని నిర్మాతలు అంటున్నారు. దీనికి తోడు థియేటర్లతో మరికొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఐతే ఇప్పుడు మల్టీప్లెక్సులు కొత్త కంటెంట్ కోసం తమ వైపు చూస్తున్న నేపథ్యంలో నిర్మాతలు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయంగా భావించారు.
ఈ నేపథ్యంలో రెవెన్యూ షేరింగ్ మార్చాలని వాళ్లు ఒక ప్రతిపాదన పెట్టారు. ఇప్పటిదాకా ఒక సినిమాకు తొలి వారంలో వచ్చే వసూళ్లలో నిర్మాతలకు 55 శాతం, మల్టీప్లెక్సులకు 45 శాతం ఆదాయం దక్కుతోంది. తర్వాతి మూడు వారాల్లో వరుసగా 45:55, 40:60, 35:65 నిష్పత్తిలో నిర్మాతలు, థియేటర్లకు ఆదాయం అందుతోంది.
ఐతే ఇకపై తొలి వారం ఆదాయంలో తమకు 60 శాతం వాటా ఇచ్చి మల్టీప్లెక్సులు 40 శాతం తీసుకోవాలని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ డిమాండ్. తర్వాతి రెండు వారాల్లో 50:50, 40:60 నిష్పత్తిలో వాటా పంచుకుందామని ప్రతిపాదన పెట్టారు. ఈ రెవెన్యూ షేరింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలని.. దీంతో పాటు తమ నుంచి వసూలు చేసే వర్చువల్ ప్రింట్ ఫీని రద్దు చేయాలని, థియేటర్లలో వేసే ట్రైలర్లకు డబ్బులు వసూలు చేయొద్దని, మల్టీప్లెక్సుల ఆవరణలో పెట్టే పోస్టర్లు, ఇతర మెటీరియల్స్కి డబ్బులు వసూలు చేయకూడదని, ప్రభుత్వం అధిక షోలకు అనుమతిస్తే మల్టీప్లెక్సులు పాటించాలని.. ఇలా కొన్ని డిమాండ్లు పెట్టారు. మరి వీటికి మల్టీప్లెక్సుల యాజమాన్యాలు ఎంతమేర అంగీకరిస్తాయో చూడాలి.
This post was last modified on December 1, 2020 1:37 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…