మాస్ రాజా రవితేజ కెరీర్లో ఎంతో ముఖ్యమైన సినిమా.. మాస్ జాతర. గత ఏడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో షాక్ తిన్న ఆయన.. కొంచెం గ్యాప్ తీసుకుని ‘మాస్ జాతర’ చేశాడు. ‘సామజవరగమన’తో రైటర్గా మంచి పేరు సంపాదించిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద ఈ సినిమాను నిర్మించాడు. శుక్రవారం ఫస్ట్ షోల నుంచి ఈ సినిమా ప్రేక్షకులను పలకరిస్తోంది. రేపు పూర్తి స్థాయిలో రిలీజవుతుంది. ‘బాహుబలి: ది ఎపిక్’ రీ రిలీజ్తో పోటీ పడుతూ ఈ సినిమా థియేటర్లలోకి దిగింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ఎంత? ఏమేర కలెక్ట్ చేస్తే సేఫ్ అవుతుంది? అనే ప్రశ్నలు రవితేజ అభిమానుల్లో ఉన్నాయి.
‘మాస్ జాతర’ బాక్సాఫీస్ టార్గెట్ మరీ పెద్దదేమీ కాదు. వరల్డ్ వైడ్ రూ.21 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది మాస్ రాజా కొత్త సినిమా. అంటే గ్రాస్ రూ.35 కోట్ల మేర రావాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.14 కోట్ల షేర్ రాబడితే సినిమా సేఫ్ అవుతుంది. మాస్ రాజా బాక్సాఫీస్ స్టామినాకు ఇది పెద్ద టార్గెట్ ఏమీ కాదు. కాకపోతే ఆయన గత చిత్రాల ప్రభావం ఈ సినిమాపై కొంత పడిందన్నది వాస్తవం. అందుకే బిజినెస్ భారీగా జరగలేదు.
సినిమాకు బాగానే ఖర్చయినప్పటికీ.. ఓటీటీ డీల్ ద్వారా మంచి ఆదాయమే రావడంతో నిర్మాత నాగవంశీ ఓ మోస్తరు రేటుకే సినిమాను అమ్మాడు. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన వార్-2, ప్రొడ్యూస్ చేసిన ‘కింగ్డమ్’ నిరాశ పరిచిన నేపథ్యంలో నాగవంశీ కాస్త తక్కువ రేట్లకే సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది. సేఫ్ టార్గెట్లే ఉన్నాయి సినిమాకు. కావాల్సిందల్లా పాజిటివ్ టాకే. మాస్ ఈ సినిమాకు కనెక్ట్ అయితే ఈజీగానే పనైపోతుంది.
This post was last modified on October 31, 2025 8:43 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…