వచ్చే వారం వస్తున్న కొత్త సినిమాల్లో కాస్త నోటబుల్ అని చెప్పుకోదగిన వాటిలో ముఖ్యమైంది ది గర్ల్ ఫ్రెండ్. రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషించిన ఈ వెరైటీ లవ్ థ్రిల్లర్ కు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. నాగార్జునతో మన్మథుడు 2 లాంటి అవకాశాన్ని వృథా చేసుకున్న తనకు ఇప్పుడీ గర్ల్ ఫ్రెండ్ చాలా ముఖ్యం. ప్రమోషన్ల పరంగా ఏమేం చేయాలో అంత చేస్తున్నారు. ఆ మధ్య చేసిన ట్రైలర్ లాంచ్ జనాల దృష్టిలోకి వెళ్ళింది. ఇంటర్వ్యూ కంటెంట్ ఆడియన్స్ కి మెల్లగా రీచ్ అవుతోంది. అంతా బాగానే ఉంది కానీ కేవలం రష్మిక బ్రాండ్ తోనే దీనికి ఓపెనింగ్స్ వస్తాయన్న గ్యారెంటీ లేదు.
పబ్లిసిటీ పరంగా ఏదో మేజిక్ జరగాలి. త్వరలో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండని తీసుకొస్తామని అల్లు అరవింద్ చెప్పినప్పటికీ ఇప్పుడప్పుడే ఈ జంట స్టేజిలో షేర్ చేసుకునే ఉద్దేశంలో లేదని ఇన్ సైడ్ టాక్. ఎంగేజ్ మెంట్ అయినా తమ బంధాన్ని ఇప్పటిదాకా అఫీషియల్ చేయని విజయ్, రష్మికలు సరైన సందర్భం వేదిక కోసం ఎదురు చూస్తున్నారట. అది గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించింది అయితే బాగుంటుందనేది నిర్మాతల ఆలోచన. కానీ వీళ్ళు ఎంత వరకు సుముఖ్యంగా ఉంటారనేది చూడాలి. నవంబర్ 7 రిలీజ్ అవుతున్న వాటిలో సాలిడ్ గా చెప్పుకునే కాంపిటీషన్ పెద్దగా లేదు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ మూవీ తమ్మ అంచనాలకు తగ్గట్టు పెర్ఫార్మ్ చేయలేకపోయింది. మాడక్ హారర్ సిరీస్ లో ఇదే వీకెఎస్ట్ మూవీగా విమర్శకులు వర్ణించారు. రష్మిక నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ అసలు కంటెంట్ జనాన్ని మెప్పించలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే సికందర్ తర్వాత అంత ఫ్లాప్ తమ్మనే అంటున్నారు. యానిమల్, పుష్ప 2, చావాలతో మంచి ఊపు మీదున్న టైంలో ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు ఇబ్బంది పెట్టేవే. ఇక యూత్ ని టార్గెట్ చేసుకుంటున్న ది గర్ల్ ఫ్రెండ్ కనక ట్రైలర్ చూపించినట్టు షాకింగ్ ఎలిమెంట్స్ తో కనక ఉంటే శ్రీవల్లి ఖాతాలో సోలో విజయం పడిపోతుంది.
This post was last modified on October 31, 2025 4:59 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…