కన్నడ భామ రష్మిక మందన్నా కెరీర్లో అతి పెద్ద మలుపు పుష్ప సినిమానే. ఆ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో ఆమె దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు సంపాదించింది. ఆ మాటకొస్తే విదేశాల్లో సైతం రష్మిక మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ‘పుష్ప-2’తో ఆమె క్రేజ్ ఇంకా ఏ స్థాయిలో విస్తరించిందో తెలిసిందే. ఐతే ఇంత ఇంపాక్ట్ చూపించిన పాత్ర ముందు తనకు అర్థం కాలేదని.. దాంతో కనెక్ట్ కాలేకపోయానని చెప్పింది రష్మిక.
‘పుష్ప’ సినిమా చేస్తున్నపుడు ఆ కథ.. తన పాత్ర కొంచెం గందరగోళంగా అనిపించినట్లు రష్మిక తెలిపింది. పార్ట్-1లో సుకుమార్ వరల్డ్ బిల్డింగ్ మీద దృష్టిపెట్టారని.. దీంతో తనకు కథ మీద క్లారిటీ రాలేదని రష్మి చెప్పింది. షూటింగ్కు వెళ్లడం.. తనకు ఇచ్చిన సీన్ చేసి వచ్చేయడం.. ఇలా ఉండేదని.. ఓవరాల్గా కథలో ఏం జరుగుతోందో అర్థం అయ్యేది కాదని ఆమె చెప్పింది. కానీ పార్ట్-2కు వచ్చేసరికి తనకు చాలా విషయాల మీద క్లారిటీ వచ్చిందని.. సుకుమార్ ముందు అలా ఎందుకు చేశారో అప్పుడు అర్థమైందని రష్మిక చెప్పింది.
‘పుష్ప-2’ నటించడాన్ని ఎంతో ఆస్వాదించానని.. అది తన కెరీర్లోనే ది బెస్ట్ అనదగ్గ పెర్ఫామెన్స్ అని రష్మిక చెప్పింది. ఒక నటి ఐదు నిమిషాల పాటు కేవలం తను మాత్రమే పెర్ఫామ్ చేసే అవకాశం ఎప్పుడో కానీ రాదని.. తనకు జాతర ఎపిసోడ్లో ఆ అద్భుత అవకాశం వచ్చిందని ఆమె చెప్పింది. ఆ సీన్ చేస్తున్నపుడు సెట్లో ఎవరెవరు ఉన్నారు.. కెమెరా ఎక్కడ ఉంది.. ఎవరేం చేస్తున్నారు అన్నది పట్టించుకోకుండా కేవలం తన పెర్ఫామెన్స్ మీద మాత్రమే దృష్టిపెట్టి స్వేచ్ఛగా నటించానని.. అందుకే ఆ సన్నివేశం అంత బాగా వచ్చిందని రష్మిక చెప్పింది. ఈ పాత్ర తన కెరీర్లో ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమని ఆమె అభిప్రాయపడింది.
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…