పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, మద్దతుదారులకు ఉన్నట్లుండి పెద్ద శత్రువుగా మారిపోయారు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్. పవన్ రాజకీయ విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడంపై ప్రకాష్ రాజ్ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ‘‘పవన్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడు’’ అనే మాట అతడి అభిమానులకు ఏమాత్రం రుచించలేదు.
ఇంత పెద్ద మాట ప్రకాష్ రాజ్ అనాల్సింది కాదనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై నాగబాబు తీవ్రంగా స్పందించడం, దానికి ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో బదులివ్వడంతో కొన్ని రోజులుగా ఈ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ప్రకాష్ రాజ్ తనపై చేసిన విమర్శలకు సంబంధించి పవన్ స్పందన ఏంటి.. సందర్భం వచ్చినపుడు ఆయన ప్రకాష్ రాజ్కు ఏమని బదులిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
పవన్ మీడియాను కలిసినపుడు కచ్చితంగా ఈ ప్రశ్న ఎదురు కావచ్చు. ఐతే అంతకంటే ముందు ప్రకాష్ రాజ్.. పవన్కు ఎదురు పడితే ఇద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందన్నది ఆసక్తికరం. నిజానికి ఇప్పుడు ఇద్దరి మధ్య అలాంటి సందర్భమే ఉంది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’లో ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇందులో పవన్ బాధితురాళ్లయిన అమ్మాయిల తరఫున వాదించే లాయర్ పాత్ర చేస్తుండగా.. అటు వైపు బడా బాబుల వైపు వాదించే ప్రత్యర్థి లాయర్గా ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నాడు.
ఈ నెల ఆరంభం నుంచే పవన్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ప్రకాష్ రాజ్కు కూడా ఈ సన్నివేశాల్లో భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం పవన్ కొంత విరామం తీసుకుని.. మళ్లీ షూటింగ్కు రాబోతున్నాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ కూడా షూటింగ్లో పాల్గొనే అవకాశముంది. అదే జరిగితే ప్రకాష్ రాజ్ తాజా విమర్శల నేపథ్యంలో వీళ్లిద్దరూ ఒకరికొకరు ఎదురు పడ్డపుడు పరిస్థితి ఏంటో చూడాలి.
ఇద్దరూ మామూలుగా మాట్లాడుకుంటారా.. బేషజాల్లేకుండా పలకరించుకుంటారా.. విమర్శల ప్రస్తావన వస్తుందా అన్నది ఆసక్తికరం. ఇదే విషయం ప్రకాష్ రాజ్ దగ్గర ప్రస్తావిస్తే వ్యక్తిగతంగా, సినిమాల పరంగా తనకు పవన్తో ఎలాంటి విభేదాలు లేవని.. ప్రొఫెషనల్గా తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఇంతకుముందు వీళ్లిద్దరూ బద్రి, కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 30, 2020 2:00 pm
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…
తెలుగులో సినిమా నిర్మాణం పెద్ద జూదంగా మారిపోయిన పరిస్థితి. సక్సెస్ రేట్ రాను రాను పడిపోతోంది. ప్రేక్షకుల నుంచి సంపూర్ణ…
వైసీపీ అధినేత జగన్.. తన సతీమణి భారతితో కలిసి.. యూరప్ పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ…