ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ కు విడుదల కావాల్సిన అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఫ్యాన్స్ కొత్త డేట్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆ లాంఛనం అయిపోయింది. 2026 మార్చ్ 19 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ కాంపిటేషన్ పరంగా చూసుకుంటే డెకాయిట్ చాలా పెద్ద రిస్క్ చేస్తోంది. ఎందుకంటే సరిగ్గా వారం రోజుల తర్వాత వరసగా మార్చి 26, 27 తేదీల్లో రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ రాబోతున్నాయి. వీటి మీదున్న హైప్ కి వారం పది రోజులు అటుఇటు పోటీకి దిగడం సవాలే.
అయినా సరే డెకాయిట్ ఈ నిర్ణయం తీసుకోవడం చూస్తే వాటిలో ఏదో ఒకటి వాయిదా పడుతుందనే ధీమా ఏదైనా ఉందేమో. కథ ఇక్కడితో అయిపోలేదు. మార్చి 19 యష్ ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్ ఉంది. షూటింగ్ అయితే జరుగుతోంది. కెజిఎఫ్ తర్వాత సినిమా కావడంతో డిమాండ్ మాములుగా లేదు. దాంతో ఫేస్ టు ఫేస్ క్లాష్ అంటే ఏపీ తెలంగాణ కాకుండా బయట రాష్ట్రాల్లో డెకాయిట్ కు పెద్ద సవాలవుతుంది. ఇది కాకుండా రన్బీర్ కపూర్ – సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ సైతం అదే డేట్ మీద కర్చీఫ్ వేసుకుని ఉంది. పోస్ట్ పోన్ గురించి ఎలాంటి టాక్ లేదు కానీ ప్రస్తుతానికి వాయిదా వేసుకోలేదు.
రెండేళ్లుగా తెరమీద దర్శనం లేకుండా పోయిన అడివి శేష్ సోలోగా రాకుండా ఇంత రిస్క్ చేయడం చూస్తుంటే అన్నపూర్ణ స్టూడియోస్ లెక్కలు ఏవో వేరుగా ఉన్నట్టున్నాయి. కథలు, బడ్జెట్ ల ఎంపిక తనదంటూ విలక్షణమైన శైలి పాటిస్తున్న అడవి శేష్ డెకాయిట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ముందు శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకుని కొంత షూట్ అయ్యాక ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ని తీసుకొచ్చి మళ్ళీ రీ షూట్ చేయడం తెలిసిందే. శేష్ కూడా ఒక ప్రమాదంలో గాయాల పాలయ్యాడు. ఇన్ని స్పీడ్ బ్రేకర్స్ దాటుకుంటూ వచ్చిన డెకాయిట్ మీద ట్రేడ్ అయితే మంచి బజ్ ఉంది. అనురాగ్ కశ్యప్ ఇందులో విలన్.
This post was last modified on October 28, 2025 1:41 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…