ఒక రీ రిలీజ్ సినిమా కోసం దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూడడం బహుశా తొలిసారి జరుగుతుండొచ్చు. ఈ నెల 31న విడుదలయ్యే బాహుబలి: ది ఎపిక్ పట్ల అంతకంతకూ ఆసక్తి పెరిగిపోతోంది. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి విజువల్ వండర్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి.. బాహుబలి రెండు భాగాలను కలిపి ఒకటిగా రిలీజ్ చేయాలన్న సరికొత్త ఆలోచనతో మరోసారి ట్రెండ్ సెట్ చేశారు.
ముందు బాహుబలిని ఒక్క సినిమాగానే తీయాలనుకున్నారు కాబట్టి.. అలా తీసి ఉంటే ఎలా ఉండేదో ఈ నెల 31న ప్రేక్షకులు చూడబోతున్నారు. ఐతే రెండు సినిమాలను కలిపి ఒకటిగా చేసే క్రమంలో చాలా సీన్లు కట్ చేస్తారన్న విషయం తెలిసిందే. పాటలు, సన్నివేశాలు కలిపి దాదాపు గంటన్నర దాకా కట్ అయిపోతుంది. మరి కొత్తగా సినిమాలో సన్నివేశాలు ఏమైనా ఉంటాయా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. దీనికి ఔనని సమాధానం చెప్పాడు బాహుబలి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.
బాహుబలి రీ రిలీజ్ నేపథ్యంలో సెంథిల్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ నెల 31న ఎపిక్ రిలీజ్లో కొత్త సన్నివేశం ఒకటి చూస్తారన్నాడు. ఐతే ఈ సన్నివేశం కొత్తగా షూట్ చేసిందేమీ కాదని అతను చెప్పాడు. ఎడిటింగ్ టైంలో కట్ అయిపోయిన ఒక సన్నివేశాన్ని ఇప్పుడు సినిమాలో కలుపుతున్నారని.. అది కథలో కీలకంగానే ఉంటుందని సెంథిల్ చెప్పాడు. ఈగ తర్వాత బాహుబలి కథ చెప్పినపుడే ఇదొక విజువల్ వండర్ అనే విషయం అర్థమైందని.. అందుకు తగ్గట్లుగా ఒక సినిమాటోగ్రాఫర్గా సన్నద్ధం అయ్యానని సెంథిల్ చెప్పాడు.
ముందు ఈ సినిమాలోని కొన్ని సీన్లను ఔట్ డోర్ లొకేషన్లలో తీద్దామనుకున్నామని.. అలాగే ఒక సీన్ తీశామని.. కానీ కెమెరా ఎక్కడ పెట్టినా.. ఏదో ఒక చోట జనం కనిపించేవారని.. దీంతో ఇలా సాధ్యం కాదు అని రామోజీ ఫిలిం సిటీలోనే చాలా వరకు సినిమాను చిత్రీకరించామని సెంథిల్ కుమార్ వెల్లడించాడు. ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళితో సాగిన సెంథిల్ కుమార్.. ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నాడు. మహేష్ బాబు సినిమాకు పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు.
This post was last modified on October 27, 2025 11:37 am
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…