మాస్ మహారాజా కొత్త సినిమా ‘మాస్ జాతర’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరికి అక్టోబరు 31న ఈ చిత్రాన్ని విడుదల చేసి తీరాలని నిర్ణయించారు. ఇన్నిసార్లు సినిమా వాయిదా పడడంపై తమ మీద తామే సెటైర్లు వేసుకుంటూ కొన్ని రోజుల కిందట ఒక వీడియో కూడా చేసింది ‘మాస్ జాతర’ టీం. ఆ సందర్భంలోనే అక్టోబరు 31న సినిమా పక్కాగా విడుదలవుతుందని నొక్కి వక్కాణించారు.
కానీ తాజా సమాచారం ప్రకారం ఆ రోజు కూడా సినిమా రిలీజ్ కాదట. అలా అని ఆ సినిమా ఇంకొన్ని వారాలు వెనక్కి వెళ్తుందేమో అని సందేహించాల్సిన పని లేదు. అక్టోబరు 31నే ‘మాస్ జాతర’ షోలు పడనున్నాయి. కానీ అధికారిక రిలీజ్ మాత్రం నవంబరు 1న అని సమాచారం. 31న ఈ చిత్రానికి పరిమిత సంఖ్యలో పెయిడ్ ప్రిమియర్స్ వేయబోతున్నారు. తర్వాతి రోజు సినిమా పూర్తి స్థాయిలో విడుదలవుతుంది.
రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి: ది ఎపిక్’ ఈ నెల 31న రీ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’లను కలిపి ఒక సినిమాగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘మాస్ జాతర’ను ఒక రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. మామూలుగా అయితే రీ రిలీజ్లకు ఇలాంటి మిడ్ రేంజ్ సినిమాలు దారి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ రాజమౌళి అండ్ కో అందరి మీదా రవితేజ సహా మాస్ జాతర టీంలో అందరికీ గౌరవ భావం ఉంది.
‘బాహుబలి’ అంటే తెలుగు సినిమాకు ఒక ప్రైడ్లాగా ఫీలవుతారు అందరూ. పైగా రాజమౌళి స్వయంగా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టి రెండు భాగాలను కలిపి ఒకటిగా చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఆడియన్స్లో కూడా సినిమా పట్ల అమితాసక్తి నెలకొంది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో జరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని 31వ తేదీని ‘బాహుబలి’కి వదిలేసి తర్వాతి రోజు ‘మాస్ జాతర’ను రిలీజ్ చేయబోతున్నారు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…