‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించి ప్రభాస్ కథానాయకుడు.. ‘తానాజీ’తో 2020లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ అందించిన ఓం రౌత్ దర్శకుడు.. అగ్ర నిర్మాణ సంస్థల భాగస్వామ్యం.. రూ.500 కోట్ల బడ్జెట్.. రామాయణం నేపథ్యంలో కథ.. ఈ వార్తలన్నీ చూసి ‘ఆదిపురుష్’ మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు. ప్రభాస్ కెరీర్లో ఇది మరో ‘బాహుబలి’ అవుతుందని భావించారు. కానీ తర్వాత ‘ఆదిపురుష్’ గురించి వచ్చిన అప్ డేట్, ఈ మధ్య వస్తున్న వార్తలు మాత్రం సినిమాపై అంచనాల్ని తగ్గించేస్తున్నాయి. ప్రభాస్ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. సినిమాలో కథానాయిక, విలన్ పాత్రల విషయంలో ప్రేక్షకుల అంచనాలు, ఆశలు వేరుగా ఉన్నాయి. ప్రభాస్కు దీటైన వాళ్లే ఆ పాత్రలు చేస్తారని ఆశించారు.
కానీ రావణుడిని పోలిన విలన్ పాత్రకు సైఫ్ అలీ ఖాన్ను ఎంచుకోవడంతోనే ఆసక్తి సన్నగిల్లింది. ప్రభాస్ ముందు విలన్గా అతను నిలవలేడన్న అభిప్రాయం కలిగింది. సైఫ్ మంచి నటుడే అయినప్పటికీ.. అతణ్ని సెకండ్ గ్రేడ్ హీరోగానే చూస్తారు జనాలు. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ప్రభాస్ ముందు అతను తేలిపోతాడనే అభిప్రాయముంది. ముఖ్యంగా రావణుడి పాత్రలో ఉండాల్సిన గాంభీర్యం, క్రూరత్వం అతను చూపించలేడనే అంటున్నారు చాలామంది. ఈ సెలక్షనే నిరాశ కలిగించేదంటే.. ఇప్పుడు సీత, లక్ష్మణుడి పాత్రలకు తాజాగా వినిపిస్తున్న పేర్లు ఇంకా నిరాశను పెంచుతున్నాయి.
ఏ కియారా అద్వానీ లాంటి వాళ్లనో ఎంచుకుంటారనుకుంటే.. కృతి సనన్ పేరు తెరపైకి వచ్చిందిప్పుడు. ఆమె సీతగా కానీ, ప్రభాస్కు జోడీగా కానీ ఏమాత్రం బాగుండదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అలాగే లక్ష్మణుడి పాత్రకు పెద్ద పేరు లేని సన్నీ సింగ్ ఎంపికయ్యాడన్న వార్తా నిరాశే కలిగిస్తోంది. ఓవైపు ప్రభాస్ ఉండగా.. ఇంకోవైపు వీళ్లందరినీ పెడితే మిస్ మ్యాచ్ అవుతుందని.. సినిమాకు ‘భారీతనం’ చేకూరడం కష్టమని.. కాస్టింగ్ విషయంలో చేస్తున్న ఈ పొరబాట్లు సినిమాపై హైప్ను తగ్గించేస్తాయని అభిమానులు భయపడుతున్నారు. మరి రూ.500 కోట్ల బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు కాస్టింగ్ విషయంలో ఎందుకు భారీగా ఆలోచించట్లేదన్నది ప్రశ్న.
This post was last modified on November 30, 2020 6:55 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…