రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూసి పదేళ్ల కిందటే జనాలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. అప్పటికే ఆయన స్థాయి బాగా పడిపోయి నాసిరకం సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. గత మూణ్నాలుగేళ్లలో అయితే వర్మ మరీ పతనం అయిపోయాడు. అత్యంత పేలవమైన సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు. ఒకప్పుడు వర్మ ఫ్లాప్ సినిమాల్లోనూ క్వాలిటీ కనిపించేది. ఏదో ఒక ప్రత్యేకత ఉండేది.
కానీ గత కొన్నేళ్లలో అయితే వర్మ కనీస విలువలు లేకుండా సినిమాలు తీసి తన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడాయన. వర్మ డైహార్డ్ ఫ్యాన్స్ సైతం ఆయన్ని లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. కరోనా టైంలో అరగంట, గంట నిడివితో బూతు సినిమాలు తీసి ఆన్ లైన్ల పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేసి బాగానే సొమ్ము చేసుకున్నాడు వర్మ. ఐతే ఈ టైపు సినిమాలను కూడా తర్వాత జనాలు పట్టించుకోవడం మానేశారు.
అయినా వర్మ ఏమీ ఆగిపోలేదు. తన శిష్యుల్ని పెట్టి సినిమాలు తీయిస్తూనే ఉన్నాడు. డిసెంబరు నెలలో వర్మ సినిమాలు ఒకటికి మూడు రిలీజవుతుండటం విశేషం. అవే.. కరోనా వైరస్, మర్డర్, దిశ ఎన్కౌంటర్. ఇందులో మర్డర్, దిశ సినిమాల మీద ఎంత వివాదం నడిచిందో తెలిసిందే. కోర్టు వివాదాలను అధిగమించి ఈ చిత్రాలను రిలీజ్ చేయడానికి వర్మ ప్రయత్నిస్తున్నాడు.
కరోనా వైరస్ను డిసెంబరు 11న థియేటర్లలోకి వదులాతడట వర్మ. 18న మర్డర్, 25న దిశ ఎన్కౌంటర్ రిలీజవుతాయట. ఐతే వర్మ సినిమాలను విడుదలకు సిద్ధం చేయడం, రిలీజ్ డేట్లు ప్రకటించడం, సోషల్ మీడియాలో విపరీతంగా వీటిని ప్రమోట్ చేయడం బాగానే ఉంది. కానీ వర్మ సినిమాల మీద జనాలకు కనీస స్థాయిలో కూడా ఆసక్తి కనిపించడం లేదు. వర్మ అదే పనిగా ట్విట్టర్లో ఊదరగొడుతున్నా ఎవరూ స్పందించడం లేదు. ఆయన్ని పట్టించుకోవడం లేదు.
మరీ లో బడ్జెట్లో సినిమాలు తీసి సొమ్ము చేసుకుందామని చూసే వర్మకు ఈసారి ఆ కాస్త ఖర్చయినా వెనక్కి వస్తుందా అన్నది సందేహమే. ఎందుకంటే వర్మ సినిమాలొస్తున్నాయంటే దాన్ని అలెర్ట్గా భావించి ఆ ఛాయలకు వెళ్లకూడదని భావిస్తున్నారు జనాలు. కుర్రాళ్లు ఎగబడ్డానికి ఇప్పుడు వర్మ నుంచి వస్తున్నవి బూతు సినిమాలు కూడా కాదాయె.
This post was last modified on December 2, 2020 8:46 am
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…