Movie News

వర్మ గారి సినిమాలొస్తున్నాయహో..

రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూసి పదేళ్ల కిందటే జనాలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. అప్పటికే ఆయన స్థాయి బాగా పడిపోయి నాసిరకం సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. గత మూణ్నాలుగేళ్లలో అయితే వర్మ మరీ పతనం అయిపోయాడు. అత్యంత పేలవమైన సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు. ఒకప్పుడు వర్మ ఫ్లాప్ సినిమాల్లోనూ క్వాలిటీ కనిపించేది. ఏదో ఒక ప్రత్యేకత ఉండేది.

కానీ గత కొన్నేళ్లలో అయితే వర్మ కనీస విలువలు లేకుండా సినిమాలు తీసి తన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడాయన. వర్మ డైహార్డ్ ఫ్యాన్స్ సైతం ఆయన్ని లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. కరోనా టైంలో అరగంట, గంట నిడివితో బూతు సినిమాలు తీసి ఆన్ లైన్ల పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేసి బాగానే సొమ్ము చేసుకున్నాడు వర్మ. ఐతే ఈ టైపు సినిమాలను కూడా తర్వాత జనాలు పట్టించుకోవడం మానేశారు.

అయినా వర్మ ఏమీ ఆగిపోలేదు. తన శిష్యుల్ని పెట్టి సినిమాలు తీయిస్తూనే ఉన్నాడు. డిసెంబరు నెలలో వర్మ సినిమాలు ఒకటికి మూడు రిలీజవుతుండటం విశేషం. అవే.. కరోనా వైరస్, మర్డర్, దిశ ఎన్‌కౌంటర్. ఇందులో మర్డర్, దిశ సినిమాల మీద ఎంత వివాదం నడిచిందో తెలిసిందే. కోర్టు వివాదాలను అధిగమించి ఈ చిత్రాలను రిలీజ్ చేయడానికి వర్మ ప్రయత్నిస్తున్నాడు.

కరోనా వైరస్‌ను డిసెంబరు 11న థియేటర్లలోకి వదులాతడట వర్మ. 18న మర్డర్, 25న దిశ ఎన్‌కౌంటర్ రిలీజవుతాయట. ఐతే వర్మ సినిమాలను విడుదలకు సిద్ధం చేయడం, రిలీజ్ డేట్లు ప్రకటించడం, సోషల్ మీడియాలో విపరీతంగా వీటిని ప్రమోట్ చేయడం బాగానే ఉంది. కానీ వర్మ సినిమాల మీద జనాలకు కనీస స్థాయిలో కూడా ఆసక్తి కనిపించడం లేదు. వర్మ అదే పనిగా ట్విట్టర్లో ఊదరగొడుతున్నా ఎవరూ స్పందించడం లేదు. ఆయన్ని పట్టించుకోవడం లేదు.

మరీ లో బడ్జెట్లో సినిమాలు తీసి సొమ్ము చేసుకుందామని చూసే వర్మకు ఈసారి ఆ కాస్త ఖర్చయినా వెనక్కి వస్తుందా అన్నది సందేహమే. ఎందుకంటే వర్మ సినిమాలొస్తున్నాయంటే దాన్ని అలెర్ట్‌గా భావించి ఆ ఛాయలకు వెళ్లకూడదని భావిస్తున్నారు జనాలు. కుర్రాళ్లు ఎగబడ్డానికి ఇప్పుడు వర్మ నుంచి వస్తున్నవి బూతు సినిమాలు కూడా కాదాయె.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

1 hour ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

1 hour ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

3 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

6 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

7 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

7 hours ago