Movie News

బాహుబ‌లి: ఎపిక్ గురించి ఏడేళ్ల ముందే

ఇండియన్ సినిమాలో ఒక కథను రెండు భాగాలు చేసి రెండు సినిమాలు చేసే ట్రెండుకు శ్రీకారం చుట్టిన సినిమా.. బాహుబలి. ముందు ఒక సినిమాగానే మొదలైనప్పటికీ.. కథ పరిధి పెద్దది కావడం, బడ్జెట్‌‌ను కూడా దృష్టిలో ఉంచుకుని దీన్ని రెండు భాగాలు చేశాడు రాజమౌళి. 2015లో తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ పేరుతో రిలీజై అద్భుత విజయం సాధిస్తే.. 2017లో రెండో భాగాన్ని ‘బాహుబలి: ది కంక్లూజన్’గా రిలీజ్ చేసి మరింత సెన్సేషన్ క్రియేట్ చేశాడు జక్కన్న. ఐతే ఇప్పుడు ఇండియన్ సినిమాలో తొలిసారిగా రెండు భాగాలుగా రిలీజైన సినిమాను ఒకటిగా చేసి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేస్తోంది టీం.

ఐతే ఆ చిత్ర బృందంలో ఈ ఆలోచన ఎప్పుడు ఎవరికి వచ్చిందన్నది స్పష్టత లేదు. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజైనపుడు ఒక వ్యాపారవేత్త సోషల్ మీడియా వేదికగా ఈ ఐడియా ఇవ్వడం విశేషం. బాహుబలి-2 విడుదలైన వారానికి పారిశ్రామిక వేత్త, లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణరావు ట్విట్టర్లో దర్శకుడు రాజమౌళిని ట్యాగ్ చేస్తూ.. 2017 మే 6న ఒక పోస్టు పెట్టారు. ‘‘రాజమౌళి గారు… బాహుబలి పార్ట్ 1, 2 కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం.

ఈ అద్భుతంతో మళ్లీ తక్కువలో తక్కువగా రూ.500 కోట్లు కలెక్షన్స్ రాబట్టవచ్చు. అలాగే ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో చూపించవచ్చు’’ అని విక్రమ్ నారాయణ రావు ట్వీట్లో పేర్కొన్నారు. ఐతే ఆ ఐడియా బాహుబలి టీం వరకు చేరి, ఇప్పుడు ఇలా చేస్తున్నారేమో తెలియదు కాదు.. ఎనిమిదేళ్ల కిందటి ఆ ట్వీట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ‘బాహుబలి: ది ఎపిక్’ రిలీజ్ కానుంది. విక్రమ్ అప్పుడన్నట్లు 500 కోట్ల వసూళ్లు కష్టం కానీ.. ఈ సినమా మినిమం వంద కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

Kumar

Recent Posts

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

39 seconds ago

రాయ‌ల‌సీమ‌కు మరో పేరు

రాయ‌లసీమ‌ను కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల సీమ‌గా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…

5 minutes ago

ప‌నికిరాని రూల్స్ మీద బాబు గారి కన్ను

బూజు ప‌ట్టిన‌, ప్ర‌జ‌ల‌కు ప‌నికిరాని రూల్స్‌ను బుట్ట‌దాఖ‌లు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…

54 minutes ago

పులిని చూసి వాత పెట్టుకోకూడదు

ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…

1 hour ago

ఆటలు ఆడుతూనే ఉన్న జన నాయకుడు

రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…

2 hours ago

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

3 hours ago