హీరోల కొడుకులు సాధారణంగా హీరోలే అవుతారు. మాస్ రాజా తనయుడు మహాధన్ మొదట నటనలోకే అడుగు పెట్టాడు. తన తండ్రి నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజ పాత్రలో ఆకట్టుకున్నాడు ఆ కుర్రాడు. కానీ తర్వాత అతను మరే సినిమాలోనూ నటించలేదు. చదువు మీద ఫోకస్ చేశాడు. ఐతే అంతిమంగా మహాధన్ హీరోయే కావచ్చేమో కానీ.. ఈ లోపు సినిమాకు సంబంధించి అన్ని విభాగాల మీద అతను అవగాహన పెంచుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే మహాధన్ ఒక పెద్ద సినిమాకు దర్వకత్వ విభాగంలో పని చేస్తున్న విషయం వెల్లడైంది. సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నాడు మహాధన్. ఈ విషయాన్ని వెంకీనే స్వయంగా వెల్లడించాడు. రవితేజతో కలిసి అతను మాస్ జాతర సినిమాకు సంబంధించి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా మహాధన్.. సూర్య సినిమాకు దర్శకత్వ విభాగంలో పని చేస్తున్నట్లు తెలిపాడు. మరి తన కొడుకు ఎలా ఉన్నాడు అని అడిగితే.. మీరు ఎలా పెంచారో అలాగే ఉన్నాడు సార్ అంటూ నవ్వేశాడు వెంకీ.
రవితేజతో మాస్ జాతర సినిమాను ప్రొడ్యూస్ చేసిన నాగవంశీనే.. సూర్య-వెంకీ మూవీని కూడా నిర్మిస్తున్నాడు. దీంతో ఆ సినిమా కోసం మహాధన్ను ఏడీగా తీసుకుని అతడికి పని నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూడా కెరీర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయడం.. ఆ తర్వాత నటనలోకి అడుగు పెట్టి హీరోగా పెద్ద రేంజికి వెళ్లడం తెలిసిందే. మరి తండ్రి బాటలో అడుగులు వేస్తున్న మహాధన్.. హీరోనే అవుతాడా, లేక మధ్యలో దర్శకత్వం వైపు ఏమైనా చూస్తాడా అన్నది భవిష్యత్తులోనే తేలుతుంది. మాస్ జాతర ఈ నెల 31న విడుదల కానుండగా.. వెంకీ అట్లూరి-సూర్య మూవీ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on October 19, 2025 10:41 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…