ఈ మధ్య కొత్త రిలీజులకు ముందు తరచుగా వినిపిస్తున్న మాట సింపతీ కార్డు. ఏదో ఒక రకంగా చేష్టల ద్వారానో లేదా మాటల ద్వారానో సానుభూతి వచ్చేలా చేసుకుని ఓపెనింగ్స్ తెచ్చుకోవడమనేది కొందరు హీరోలు దర్శకులు ఫాలో అవుతున్నదే. అయితే దీని వల్ల పెద్దగా ఫలితం ఉండటం లేదనేది ఓపెన్ సీక్రెట్. అయినా సరే కొందరు ఈ ధోరణి విడిచిపెట్టడం లేదు. తాజాగా కె ర్యాంప్ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ ఆ మధ్య తాను తొడ కొట్టానని, మరికొందరు ఏడిపించడం ద్వారా, కన్నీళ్లు కురిపించడం ద్వారా అటెన్షన్ తెచ్చుకునే ప్రయత్నం చేశారని, కానీ అవేవి పని చేయవని కుండ బద్దలు కొట్టారు.
తన సినిమా అయినా వేరొకరిది అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకుల ఖచ్చితంగా చూస్తారు తప్ప ఎవరు ఎలాంటి మాటలు చెప్పినా పనవ్వదని తేల్చేశారు. పోటీలో ఉన్న మిత్ర మండలి, తెలుసు కదా, డ్యూడ్ లకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే రాజేష్ దండా ఎవరిని ఉద్దేశించారనేది పేరు చెప్పకపోయినా ఇటీవలే ట్రోలింగ్, యూట్యూబ్ నెగటివ్ కామెంట్స్ మీద విరుచుకుపడిన ఓ నిర్మాతని ఉద్దేశించి ఏమోనని నెటిజెన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏదైనా అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందనే సూత్రాన్ని మరోసారి మేకర్స్ గుర్తు చేసుకోవడం అవసరమే.
కె ర్యాంప్ మీద రాజేష్ దండా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కిరణ్ అబ్బవరం కూడా చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. రిస్క్ లేకుండా అందరికంటే చివర్లో శనివారం రిలీజ్ పెట్టుకున్న కె ర్యాంప్ మొదటిషో పడేలోపు మిగిలిన మూడు సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ వచ్చేస్తుంది. వాటిలో ఏది బాగున్నా ఏది బాగోకపోయినా వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు, ప్రమోషన్ల పరంగా చేసుకోవాల్సిన కె ర్యాంప్ ప్లానింగ్ కి ఉపయోగపడుతుంది. ఈ ఏడాది దిల్ రుబా రూపంలో డిజాస్టర్ చవి చూసిన కిరణ్ అబ్బవరం ఇప్పుడీ కె ర్యాంప్ తో కంబ్యాక్ అవుతానని ధీమాగా ఉన్నాడు. చూడాలి మరి రేసులో ఏ స్థానంలో ఉంటాడో, ఎలా నెగ్గబోతున్నాడో.
This post was last modified on October 16, 2025 10:41 pm
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…