ఈ మధ్య కొత్త రిలీజులకు ముందు తరచుగా వినిపిస్తున్న మాట సింపతీ కార్డు. ఏదో ఒక రకంగా చేష్టల ద్వారానో లేదా మాటల ద్వారానో సానుభూతి వచ్చేలా చేసుకుని ఓపెనింగ్స్ తెచ్చుకోవడమనేది కొందరు హీరోలు దర్శకులు ఫాలో అవుతున్నదే. అయితే దీని వల్ల పెద్దగా ఫలితం ఉండటం లేదనేది ఓపెన్ సీక్రెట్. అయినా సరే కొందరు ఈ ధోరణి విడిచిపెట్టడం లేదు. తాజాగా కె ర్యాంప్ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ ఆ మధ్య తాను తొడ కొట్టానని, మరికొందరు ఏడిపించడం ద్వారా, కన్నీళ్లు కురిపించడం ద్వారా అటెన్షన్ తెచ్చుకునే ప్రయత్నం చేశారని, కానీ అవేవి పని చేయవని కుండ బద్దలు కొట్టారు.
తన సినిమా అయినా వేరొకరిది అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకుల ఖచ్చితంగా చూస్తారు తప్ప ఎవరు ఎలాంటి మాటలు చెప్పినా పనవ్వదని తేల్చేశారు. పోటీలో ఉన్న మిత్ర మండలి, తెలుసు కదా, డ్యూడ్ లకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే రాజేష్ దండా ఎవరిని ఉద్దేశించారనేది పేరు చెప్పకపోయినా ఇటీవలే ట్రోలింగ్, యూట్యూబ్ నెగటివ్ కామెంట్స్ మీద విరుచుకుపడిన ఓ నిర్మాతని ఉద్దేశించి ఏమోనని నెటిజెన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏదైనా అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందనే సూత్రాన్ని మరోసారి మేకర్స్ గుర్తు చేసుకోవడం అవసరమే.
కె ర్యాంప్ మీద రాజేష్ దండా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కిరణ్ అబ్బవరం కూడా చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. రిస్క్ లేకుండా అందరికంటే చివర్లో శనివారం రిలీజ్ పెట్టుకున్న కె ర్యాంప్ మొదటిషో పడేలోపు మిగిలిన మూడు సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ వచ్చేస్తుంది. వాటిలో ఏది బాగున్నా ఏది బాగోకపోయినా వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు, ప్రమోషన్ల పరంగా చేసుకోవాల్సిన కె ర్యాంప్ ప్లానింగ్ కి ఉపయోగపడుతుంది. ఈ ఏడాది దిల్ రుబా రూపంలో డిజాస్టర్ చవి చూసిన కిరణ్ అబ్బవరం ఇప్పుడీ కె ర్యాంప్ తో కంబ్యాక్ అవుతానని ధీమాగా ఉన్నాడు. చూడాలి మరి రేసులో ఏ స్థానంలో ఉంటాడో, ఎలా నెగ్గబోతున్నాడో.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…