Movie News

సింపతీ కార్డుతో సినిమాలు ఆడవు

ఈ మధ్య కొత్త రిలీజులకు ముందు తరచుగా వినిపిస్తున్న మాట సింపతీ కార్డు. ఏదో ఒక రకంగా చేష్టల ద్వారానో లేదా మాటల ద్వారానో సానుభూతి వచ్చేలా చేసుకుని ఓపెనింగ్స్ తెచ్చుకోవడమనేది కొందరు హీరోలు దర్శకులు ఫాలో అవుతున్నదే. అయితే దీని వల్ల పెద్దగా ఫలితం ఉండటం లేదనేది ఓపెన్ సీక్రెట్. అయినా సరే కొందరు ఈ ధోరణి విడిచిపెట్టడం లేదు. తాజాగా కె ర్యాంప్ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ ఆ మధ్య తాను తొడ కొట్టానని, మరికొందరు ఏడిపించడం ద్వారా, కన్నీళ్లు కురిపించడం ద్వారా అటెన్షన్ తెచ్చుకునే ప్రయత్నం చేశారని, కానీ అవేవి పని చేయవని కుండ బద్దలు కొట్టారు.

తన సినిమా అయినా వేరొకరిది అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకుల ఖచ్చితంగా చూస్తారు తప్ప ఎవరు ఎలాంటి మాటలు చెప్పినా పనవ్వదని తేల్చేశారు. పోటీలో ఉన్న మిత్ర మండలి, తెలుసు కదా, డ్యూడ్ లకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే రాజేష్ దండా ఎవరిని ఉద్దేశించారనేది పేరు చెప్పకపోయినా ఇటీవలే ట్రోలింగ్, యూట్యూబ్ నెగటివ్ కామెంట్స్ మీద విరుచుకుపడిన ఓ నిర్మాతని ఉద్దేశించి ఏమోనని నెటిజెన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏదైనా అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందనే సూత్రాన్ని మరోసారి మేకర్స్ గుర్తు చేసుకోవడం అవసరమే.

కె ర్యాంప్ మీద రాజేష్ దండా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కిరణ్ అబ్బవరం కూడా చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. రిస్క్ లేకుండా అందరికంటే చివర్లో శనివారం రిలీజ్ పెట్టుకున్న కె ర్యాంప్ మొదటిషో పడేలోపు మిగిలిన మూడు సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ వచ్చేస్తుంది. వాటిలో ఏది బాగున్నా ఏది బాగోకపోయినా వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు, ప్రమోషన్ల పరంగా చేసుకోవాల్సిన కె ర్యాంప్  ప్లానింగ్ కి ఉపయోగపడుతుంది. ఈ ఏడాది దిల్ రుబా రూపంలో డిజాస్టర్ చవి చూసిన కిరణ్ అబ్బవరం ఇప్పుడీ కె ర్యాంప్ తో కంబ్యాక్ అవుతానని ధీమాగా ఉన్నాడు. చూడాలి మరి రేసులో ఏ స్థానంలో ఉంటాడో, ఎలా నెగ్గబోతున్నాడో.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

11 hours ago