బిగ్బాస్ సీజన్ 3 విజేత అవుతుందని భావించిన శ్రీముఖి స్వయంకృతం వల్ల ట్రోఫీ చేజార్చుకుంది. అసలు ఎక్కువ మందికి తెలియనే తెలియని రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అవడానికి శ్రీముఖి పరోక్షంగా దోహదపడింది. బిగ్బాస్ తర్వాత ఆమె కెరియర్ ఏమంత గొప్పగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె హోస్ట్గా ‘బొమ్మ అదిరింది’ అనే షో మొదలయింది. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే షోలు ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి.
మంచు లక్ష్మి మొదలు పెట్టిన అలాంటి షో తర్వాత రానా దగ్గుబాటి రేంజ్కి వెళ్లింది. ఇప్పుడు ఏకంగా సమంత లాంటి సూపర్స్టార్ని దింపి ఆహా కోసం సామ్ జామ్ చేస్తున్నారు. ఎలాంటి కొత్తదనం లేని ఈ షోలు క్లిక్ అవ్వాలంటే సమంత స్థాయి పాపులారిటీ కంపల్సరీ అని ఆహా వాళ్లు గుర్తించారు. అయితే అది గుర్తించని శ్రీముఖి ‘బొమ్మ అదిరింది’ అని పేరు పెట్టుకుంది కానీ ఆ షో మాత్రం అదరలేదు. 3.5 రేటింగులతో ఆ షో డొల్లతనం బయట పడిపోయింది.
ఇదిలా వుంటే సినిమా అవకాశాలను తోసిపుచ్చి వెబ్ సిరీస్లు చేయడం మీద శ్రీముఖి ఆసక్తి చూపిస్తోందట. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఘనంగా వున్నా కానీ ఆ ఆడియన్స్ని తన షోలు చూసే విధంగా శ్రీముఖి ఆకర్షించలేకపోతోంది. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాల్సిన టైమ్ వచ్చేసినట్టుంది శ్రీముఖీ.
This post was last modified on November 29, 2020 1:24 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…